వినాయక్ సాగర్‌లో మునిగి విద్యార్థి మృతి | boy drowns in vinayakasagar at Hyderabad | Sakshi
Sakshi News home page

వినాయక్ సాగర్‌లో మునిగి విద్యార్థి మృతి

Dec 4 2016 5:00 PM | Updated on Jul 12 2019 3:02 PM

హైదరాబాద్ హుస్సేన్‌సాగర్ సమీపంలోని వినాయక్ సాగర్ లో ఈతకు వెళ్లిన తొమ్మిదో తరగతి విద్యార్థి నీట మునిగి మృతిచెందాడు.

హైదరాబాద్: ఈత సరదా ఓ తొమ్మిదో తరగతి విద్యార్థి ప్రాణం తీసింది. స్నేహితులతో కలిసి ఈతకు వెళ్లిన 14ఏళ్ల బాలుడు నీట మునిగి మృతిచెందాడు. ఈ సంఘటన హైదరాబాద్ హుస్సేన్‌సాగర్ సమీపంలోని వినాయక్ సాగర్ వద్ద ఆదివారం చోటుచేసుకుంది.

స్థానికంగా నివాసముంటున్న విద్యార్థి(14) ఆదివారం కావడంతో.. స్నేహితులతో కలిసి ఆడుకోవడానికి వెళ్లాడు. ఈ క్రమంలో వినాయక నిమజ్జనం, బతుకమ్మ కోసం ఏర్పాటు చేసిన కుంటలో ఈతకొట్టడానికి దిగి నీట మునిగి మృతిచెందాడు. విషయం తెలుసుకున్న స్థానికులు మృతదేహాన్ని బయటకు తీశారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే బాలుడు మృతిచెందాడని తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement