స్వైన్‌ఫ్లూ విజృంభణ : మరొకరి మృతి | another one died in gandhi hospital over swine flu | Sakshi
Sakshi News home page

స్వైన్‌ఫ్లూ విజృంభణ : మరొకరి మృతి

Jan 23 2017 9:20 AM | Updated on Sep 5 2017 1:55 AM

స్వైన్‌ఫ్లూ విజృంభణ : మరొకరి మృతి

స్వైన్‌ఫ్లూ విజృంభణ : మరొకరి మృతి

రాష్ట్రంలో స్వైన్‌ఫ్లూ మళ్లీ పంజా విసురుతోంది.

హైదరాబాద్‌ : రాష్ట్రంలో స్వైన్‌ఫ్లూ మళ్లీ పంజా విసురుతోంది. గాంధీ ఆస్పత్రిలో స్వైన్‌ఫ్లూతో ఆదివారం రాత్రి మరో యువకుడు మరణించాడు. నాగర్‌కర్నూలు జిల్లా తాడూరు మండలం ఆకునెల్లికుదురు గ్రామానికి చెందిన లక్ష్మయ్య(31) స్వైన్‌ఫ్లూ కారణంగా మృతి చెందాడు.

నాలుగు రోజులుగా కర్మన్‌ఘాట్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయనకు స్వైన్‌ఫ్లూ సోకిందని నిర్ధారించి గాంధీ ఆస్పత్రికి తరలించారు. లక్ష్మయ్య చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీంతో ఈ నెలలో ఇప్పటి వరకు ఐదుగురు మృతి చెందారు. చలి తీవ్రతకు హెచ్‌1ఎన్‌1 వైరస్‌ మరింత బలపడినట్లు వైద్య నిపుణులు చెబుతున్నారు. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement