రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓ ప్రయాణికురాలి నుంచి కస్టమ్స్ అధికారులు మరోసారి బంగారాన్ని సీజ్ చేశారు.
హైదరాబాద్: రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓ ప్రయాణికురాలి నుంచి కస్టమ్స్ అధికారులు మరోసారి బంగారాన్ని సీజ్ చేశారు. గురువారం దుబాయి నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చిన ప్రయాణికురాలి లగేజీని అధికారులు తనిఖీ చేశారు. అందులో 700 గ్రాముల బంగారు బిస్కెట్లు ఉన్నట్లు వారు కనుగొన్నారు. అనంతరం ప్రయాణికురాలని అదుపులోకి తీసుకుని, బంగారాన్ని సీజ్ చేశారు.