డ్రంకెన్ డ్రైవ్‌లో 39 కేసులు నమోదు | 39 cases filed in the Drunken driving | Sakshi
Sakshi News home page

డ్రంకెన్ డ్రైవ్‌లో 39 కేసులు నమోదు

Apr 11 2016 7:49 PM | Updated on May 25 2018 2:06 PM

మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వారికి చెక్ చెప్పేందుకు ఎల్‌బీనగర్, ఉప్పల్ ట్రాఫిక్ పోలీసు విభాగం అధికారులు శుక్ర, శని, ఆదివారాలలో నిర్వహించిన డ్రంకన్ డ్రైవ్‌లో 39 కేసులను నమోదు చేసి సోమవారం కోర్టులో హాజరు పరిచారు.

మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వారికి చెక్ చెప్పేందుకు ఎల్‌బీనగర్, ఉప్పల్ ట్రాఫిక్ పోలీసు విభాగం అధికారులు శుక్ర, శని, ఆదివారాలలో నిర్వహించిన డ్రంకన్ డ్రైవ్‌లో 39 కేసులను నమోదు చేసి సోమవారం కోర్టులో హాజరు పరిచారు. మేజిస్ట్రేట్ పుష్పా దేశ్‌ముఖ్ డ్రంక్ అండ్ డ్రై వ్‌లో పట్టుబడిన వాహనదారుల తల్లిదండ్రులు, భార్యలను పిలిపించి వారికి కౌన్సిలింగ్ నిర్వహించి, మద్యం సేవించి వాహనాలు నడిపిన 37 మందికి రూ.2వేల జరిమానా, అతిగా మద్యం సేవించి వాహనాలు నడిపిన ఇద్దరికి నాలుగు రోజుల ట్రాఫిక్ విధులు నిర్వహించాలని తీర్పు చెప్పారు.

 

Advertisement
 
Advertisement
Advertisement