సాక్షి, హైదరాబాద్: సాగునీటి ప్రాజెక్టుల పనులు నత్తనడకలా సాగుతుండటంపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. నిర్దేశిత సమయానికి ప్రాజెక్టుల పనులు పూర్తయ్యేలా సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. రాయలసీమలో నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణ పనులు జరుగుతున్న తీరుపై జలవనరుల శాఖ ఉన్నతాధికారులతో కలిసి కర్నూలు, వైఎస్సార్, అనంతపురం, చిత్తూరు జిల్లా కలెక్టర్లతో బుధవారం సీఎం వీడియో కాన్ఫరెన్సు ద్వారా సమీక్షించారు. ‘ఈ నెల 3న జీడిపల్లి రిజర్వాయరు పరిశీలన సందర్భంగా పూడికతీత పనులను వారం రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశించా.
పనులు చేయని కాంట్రాక్టర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశా. ఆదేశించి 23 రోజులు గడిచినా లక్ష్యం మేరకు పనులు పూర్తికాలేదు...’ అని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. భూసేకరణ, పూడికతీత, కాంక్రీట్ పనులను త్వరితంగా జరపాలని ఆదేశించారు. అనుకున్న సమయానికి ప్రాజెక్టుల పూర్తికి సహకరించని కాంట్రాక్టర్లకు నోటీసులు ఇవ్వాలని, కొంతకాలం వారిని బ్లాక్లిస్టులో పెట్టాలని ఆదేశించారు. పోలవరం కుడి ప్రధాన కాలువ పనులకు రూ.700 కోట్లు ఖర్చు చేశామని, రాష్ట్రంలో భూసేకరణకు రూ.1,028 కోట్లు వ్యయం చేశామని వివరించారు. ఇప్పటి వరకూ సమయమిచ్చానని, ఇక చర్యలేనని స్పష్టం చేశారు.
డిసెంబర్ కల్లా హంద్రీ-నీవా పూర్తి
హంద్రీ-నీవా సుజల స్రవంతి రెండోదశ పనులను ఈ ఏడాది డిసెంబర్కల్లా పూర్తి చేయాలని, సీఎం సూచించారు.
ఆ 18 వేల కోట్లు.. ఇక ఖజానాకు
ప్రభుత్వంలో నిధులకు కొరతే లేదని ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి పీవీ రమేశ్ ముఖ్యమంత్రి నిర్వహించిన శాఖాధిపతుల సమావేశంలో వెల్లడించారు. ప్రభుత్వానికి చెందిన వివిధ పథకాల నిధులు రాష్ట్రవ్యాప్తంగా పలు బ్యాంకుల్లో రూ.18 వేల కోట్లు ఉన్నాయని, ఆ నిధులన్నింటినీ రాష్ట్ర ఖజానా ఖాతాలకు తీసుకువస్తామని రమేశ్ స్పష్టం చేశారు. మంగళవారం రాత్రి నిర్వహించిన శాఖాధిపతుల సమావేశంలో ఈ మేరకు ప్రస్తావించారు.
బౌద్ధ పర్యాటక కేంద్రంగా అమరావతి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజధాని అమరావతిని బౌద్ధ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని, విదేశీ యాత్రికులను ఆకర్షించేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. పర్యాటక రంగం అభివృద్ధిపై బుధవారం సచివాలయంలో ముఖ్యమంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. అమరావతిలో ప్రపంచ బౌద్ధులకు ఆకర్షణగా నిలిచేలా కాలచక్ర ఆలయాన్ని నిర్మించాలని చెప్పారు. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలను పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దాలని సీఎం పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్లోని సుందర్బన్ తరహాలో కోరంగ వన్యప్రాణి అభయారణ్య కేంద్రాన్ని అభివృద్ధి చేయాలన్నారు.
సముద్ర తీరంలో 500 దీవులు ఉన్నాయని, వీటిలో 40 దీవులను అభివృద్ధి చేసేందుకు ముందుకొచ్చే ప్రమోటర్లు, బిల్డర్లకు ప్రోత్సాహకాలు ఇస్తామన్నారు. ఓడలరేవు, అద్దూరు, ఎస్.యానాం, కోటిపల్లి తదితర ప్రాంతాలను టూరిజం సర్క్యూట్లోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. నెల్లూరును కోస్టల్ టూరిజం హబ్గా రూపొందించేందుకు రూ.31.8 కోట్లతో ప్రాజెక్టును రూపొందించామని, పులికాట్, నేలపట్టు పక్షి సంరక్షణ కేంద్రం, మైపాడు, ఇసుకపల్లి బీచ్లను అభివృద్ధి చేస్తామని అధికారులు వివరించారు. విశాఖపట్నం, తిరుపతి సర్క్యూట్ల అభివృద్ధికి, శ్రీశైలం టైగర్ పార్కు, కుప్పంలో ఎలిఫెంట్ పార్కులను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్దం చేయాలని సీఎం పేర్కొన్నారు.
ప్రాజెక్టుల పనులపై సీఎం అసంతృప్తి
Published Thu, Jul 30 2015 3:44 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రూపురేఖలు మారాయి
అగ్రి ల్యాబ్ ఎంతో ప్రయోజనం
● ప్రగతి పథంలో దూసుకుపోతున్న గ్రామాలు ● పరుగులు పెడుతున్న అభివృద్ధి పనులు ● వెల్లివిరుస్తున్న ప్రభుత్వ భవనాలు ● నాడు–నేడుతో సమూలంగా మారిన సర్కారు బడులు ● ఇళ్లు కాదు.. ఊళ్లుగా వెలిసిన జగనన్న కాలనీలు ● అబ్బో..! ఎటు చూసినా నయా మెరుగులే!
మతిస్థిమితం లేని వ్యక్తి అదృశ్యం
రేపు, ఎల్లుండి కూడా పోస్టల్ బ్యాలెట్
రోబోటిక్ టెక్నాలజీతో మోకాలి మార్పిడి శస్త్రచికిత్స
ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన మరో లారీ
అబ్బో.. ఆ యువ నాయకుడితో ఎట్టా ఏగేది?
బూటకాల ‘బాబు’
వైఎస్సార్సీపీ జోష్
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement