తిరుచానూరు ఆలయంలో సామూహిక వ్రతాలు | special pujas at tiruchanuru padmavathi temple | Sakshi
Sakshi News home page

తిరుచానూరు ఆలయంలో సామూహిక వ్రతాలు

Aug 28 2015 9:00 AM | Updated on Sep 3 2017 8:18 AM

చిత్తూరు జిల్లా తిరుచానూరులోని శ్రీ పద్మావతీ అమ్మవారి ఆలయంలో శ్రావణ శుక్రవారం సందర్భంగా సామూహిక వ్రతాలు జరగనున్నాయి.

తిరుచానూరు: చిత్తూరు జిల్లా తిరుచానూరులోని శ్రీ పద్మావతీ అమ్మవారి ఆలయంలో శ్రావణ శుక్రవారం సందర్భంగా సామూహిక వ్రతాలకు ఏర్పాట్లు చేశారు. ఆస్తాన మండపంలో ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు ఈ వ్రతాలు జరగనున్నాయి.

అమ్మవారి ఉత్సవ మూర్తిని కొలువుదీర్చి అర్చకులు వ్రతాలు నిర్వహించనున్నారు. అమ్మవారి దర్శనం కోసం శుక్రవారం ఉదయం నుంచే భక్తుల రద్దీ పెరిగింది. అభిషేకం అనంతరం భక్తులను దర్శనానికి అనుమతించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement