జమ్మూకశ్మీర్లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు
శ్రీనగర్: జమ్మూకశ్మీర్లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. బందిపొరా జిల్లాలోని హజిన్ ప్రాంతంలో మంగళవారం ఉదయం భద్రతా బలగాలపై కాల్పులకు పాల్పడ్డారు. ఇరువర్గాల మధ్య ఎదురుకాల్పుల్లో ఇద్దరు జవాన్లకు గాయాలు కాగా.. భద్రతా బలగాలు ఓ ఉగ్రవాదిని మట్టుబెట్టాయి.
ఇంటలిజెన్స్ వర్గాల సమాచారం మేరకు పర్రే మొహల్లా ఏరియాలో ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారం మేరకు భద్రతా బలగాలు సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తుండగా ఈ ఎదురుకాల్పులు చోటు చేసుకున్నట్లు ఓ పోలీసు అధికారి వెల్లడించారు.