గోదావరి తీరాన రాజమండ్రిలో పుట్టి పెరిగిన అమ్మాయి మధు. అందుకేనేమో ఆమె ముఖంలో, నవ్వులో, పలుకులో అచ్చమైన తెలుగుదనం ఉట్టి పడుతుంటుంది. టీవీ సీరియల్స్లో ఆమెను చూస్తుండే సీనియర్ సిటిజన్లు ఆమెలో తమ మనవరాలిని చూసుకుంటారు. ‘‘షాపింగ్మాల్స్లో కనిపించినా, బయట మరెక్కడ కనిపించినా పెద్దవాళ్లు నన్ను గుర్తుపట్టి ‘ఎంత నటన అయితే మాత్రం ఎందుకమ్మా! నిన్ను మరీ అంత ఏడిపిస్తారు’ అని బాధపడేవాళ్లు. నన్ను, నా పాత్రను అంతగా ఆదరిస్తుంటే ఎంతో సంతోషంగా ఉంటుంది’’ అంటారు మధు.
తృప్తినిచ్చిన సన్నివేశం!
నాకు ఎక్కువ సంతృప్తినిచ్చిన సన్నివేశం ‘మిస్సమ్మ’లో వచ్చింది. అందులో ఇంటికి పెద్ద కూతుర్ని. చెల్లెలు పెళ్లి చేసుకుని హనీమూన్కెళ్లి ఉంటుంది. ప్రతి సంఘటననూ ఫోన్లో చెబుతూ ఉంటుంది. అదే సమయంలో ఇంట్లో తండ్రి ప్రాణాలు పోతాయి. చెల్లి అక్కడ షాపింగ్ చేస్తూ నాన్న కోసం శాలువా కొంటున్నాను, నాన్నకు చాలా బాగుంటుంది అని సంతోషంగా చెబుతూ ఉంటే, ఇక్కడ తండ్రి పార్థివ దేహం మీద శాలువా కప్పుతుంటారు. తండ్రి పోయిన విషయం చెప్పకుండా మేనేజ్ చేయాల్సిన సీన్ అన్న మాట. గొంతులో, ముఖంలో బాధ పొంగుకొస్తుండాలి, చెల్లికి అనుమానం రాకుండా సంతోషం ధ్వనింపచేయాలి.
సావిత్రి... సౌందర్య!
సావిత్రి నటన, సౌందర్య కట్టుబొట్టు నాకు చాలా ఇష్టం. నేను నటిని కాక ముందు కూడా వాళ్ల నటనను బాగా ఇన్వాల్వ్ అయి చూసేదాన్ని. ఇప్పుడైతే ఈ పాత్రను వాళ్లయితే ఎలా చేసేవాళ్లు అనే కోణంలో సాధన చేస్తున్నాను. అది నాకు చాలా ప్లస్ అవుతోంది. ఏ రోజు ఏ సీన్ నటించాల్సి ఉంటే ఆ తరహా మేకప్, డ్రస్తో వెళ్లి పోతాను. పాత్రలో అంతగా ఇన్వాల్వ్ అవుతాను కాబట్టి గ్లిజరిన్ పెట్టకుండానే నాకు ఏడుపు వచ్చేస్తుంది. అంతా సహజంగా ఉంటుందని డెరైక్టర్, మిగిలిన నటులు మెచ్చుకుంటారు కూడా.
తీరాల్సిన కోరిక!
ఇప్పటి వరకు నాకు డబ్బింగ్ చెప్పే అవకాశం రాలేదు. నా పాత్రకు సొంత గొంతుతో నటించాలని ఉంది. అలాగే పవిత్రబంధం సినిమాలో సౌందర్య చేసినటువంటి పాత్రలో నటించాలని ఉంది. ఇక కుటుంబం అంటే అక్కకు పెళ్లయింది. రాజమండ్రిలో ఉంటుంది. అమ్మానాన్న, నేను హైదరాబాద్లో ఉంటున్నాం. దేవుడు మంచి అమ్మానాన్నలను ఇచ్చాడు. ఆదరించే బంధువులను ఇచ్చాడు. అడక్కుండానే నటిని చేశాడు. అలాగే మంచి అబ్బాయితో పెళ్లి చేయిస్తాడనే నమ్మకం ఉంది.
నా పాత్ర బాధపడినా... నాకు కన్నీళ్లొస్తాయి!!
Published Tue, Sep 22 2015 12:30 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- నేడు నీట్ యూజీ
- ఐరాసలో జగన్ విజన్
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
Advertisement