సంగారెడ్డి మున్సిపాలిటీ, న్యూస్లైన్: స్థానిక సంస్థలు, మున్సిపల్, సాధారణ ఎన్నికల్లో విజయావకాశాలపై సమీక్షించేందుకు కాంగ్రెస్ పార్టీ శనివారం ఏర్పాటు చేసిన సమావేశానికి జిల్లా ముఖ్య నేతలు డుమ్మా కొట్టారు. దీంతో సమావేశం మొక్కుబడిగా సాగింది. డీసీసీ అధ్యక్షులు భూపాల్రెడ్డి విదేశీ పర్యటన లో ఉన్నందున సమావేశానికి రాలేకపోయారని డీసీసీ ప్రధాన కార్యదర్శి జగన్మోహన్రెడ్డి సమావేశంలో తెలిపారు.
అసెంబ్లీ అభ్యర్థులైన మాజీ డిప్యూటీ సీఎం దామోదర్ రాజనర్సింహ, మాజీ మంత్రులు గీతారెడ్డి, సునీతారెడ్డితోపాటు తాజా మాజీ ఎమ్మెల్యేలు జగ్గారెడ్డి, పి.కిష్టారెడ్డి, నందీశ్వర్గౌడ్, మెదక్ ఎమ్మెల్యే అభ్యర్థి విజయశాంతి, సిద్దిపేట ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీనివాస్గౌడ్ సమావేశానికి గైర్హాజరయ్యారు. ఇదిలావుంటే జహీరాబాద్, మెదక్ లోక్సభ అభ్యర్థులు సురేశ్ షెట్కార్, శ్రావణ్కుమార్రెడ్డిలు సైతం డుమ్మా కొట్టారు. ఎన్నికల్లో ఓటమి భయంతోనే సమావేశానికి హాజరు కాలేదనే విమర్శలు ఉన్నాయి. ఆయా నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు గెలిచే అవకాశం ఉన్నట్టు ప్రచారం జరుగుతుండడం వల్లే వీరు సమావేశానికి హాజరు కాలేదని తెలుస్తోంది.
సమావేశం సాగింది ఇలా..
డీసీసీ ప్రధాన కార్యదర్శి జగన్మోహన్రెడ్డి అధ్యక్షత మధ్యాహ్నం 3 గంటలకు సంగారెడ్డిలోని ఇందిర భవన్లో సమావే శం కొనసాగింది. ఈ సమావేశంలో పోలింగ్ సరళిపై చర్చించారు. ఈ సందర్భంగా గజ్వేల్ తాజా మాజీ ఎమ్మెల్యే టి.నర్సారెడ్డి మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికలతోపాటు అత్యధిక నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. దుబ్బాక తాజా మాజీ ఎమ్మెల్యే చెరుకు ముత్యంరెడ్డి మాట్లాడుతూ స్థానిక ఎన్నికలను మూడేళ్ల క్రితమే నిర్వహించి ఉంటే జిల్లాకు రూ.3,500 కోట్లు వచ్చి ఉండేవన్నారు. జెడ్పీ పీఠాన్ని సైతం దక్కించుకునేందుకు సమష్టిగా పని చే యాలని సూచించారు.
ఎన్నికల సమీక్షకు కాంగ్రెస్ నేతల డుమ్మా
Published Sat, May 10 2014 11:02 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
యూనీసెఫ్ ఇండియా నేషనల్ అంబాసిడర్గా 'కరీనా కపూర్'
‘ఆప్’ స్టార్ క్యాంపెయినర్ల లిస్టులో కేజ్రీవాల్ పేరు
టీ20 వరల్డ్కప్ వస్తోంది.. బుమ్రాకు విశ్రాంతి ఇవ్వండి: జాఫర్
హీరామండి సిరీస్లో పెద్ద తప్పులు.. ఇవి కూడా చూసుకోరా?
భూకబ్జాలు చేసేవారికి ఈ యాక్ట్ రావడం ఇష్టముండదు: సజ్జల
ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు.. 25 ఏళ్లలో..
రేపు దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష.. ఏపీలో 29 పరీక్షా కేంద్రాలు
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (03-05-2024))
లైంగిక ఆరోపణల కేసు.. రేవణ్ణ అరెస్టు
ఆర్సీబీతో మ్యాచ్.. గుజరాత్ జట్టులోకి కొత్త ప్లేయర్! తుది జట్లు ఇవే
తప్పక చదవండి
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- నాలుగుసార్లు అబార్షన్ అయిందా? క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- మా భూమి మాది కాకపోతే మరెవరిది రామోజీ..?: మంత్రి బొత్స
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- 2024 లోక్సభ ఎలక్షన్స్.. 9 లక్షల మందికి ఉపాధి!
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement