'వైఎస్ఆర్ హయాంలోనే ఆర్టీసీ బలోపేతం' | ysrcp leaders ravindranath reddy, nehru met with rtc employees | Sakshi
Sakshi News home page

'వైఎస్ఆర్ హయాంలోనే ఆర్టీసీ బలోపేతం'

Jan 30 2016 6:30 PM | Updated on May 29 2018 6:37 PM

'వైఎస్ఆర్ హయాంలోనే ఆర్టీసీ బలోపేతం' - Sakshi

'వైఎస్ఆర్ హయాంలోనే ఆర్టీసీ బలోపేతం'

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి పనిచేసిన కాలంలోనే ఆర్టీసీని బలోపేతం చేశారని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు రవీంద్రనాథ్ రెడ్డి, జ్యోతుల నెహ్రు శనివారం తెలిపారు.

కాకినాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి పనిచేసిన కాలంలోనే ఆర్టీసీని బలోపేతం చేశారని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు రవీంద్రనాథ్ రెడ్డి, జ్యోతుల నెహ్రు శనివారం తెలిపారు. అధికార తెలుగుదేశం పార్టీ ఆర్టీసీని ప్రైవేటు సంస్థలకు దారదత్తం చేసేందుకు కుట్రపన్నుతోందని వారు ఆరోపించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు తొలి సంతకం చేస్తారని ఎమ్మెల్యేలు తెలిపారు. ఆర్టీసీ ఎన్నికల్లో వైఎస్ఆర్ ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ను గెలిపించాలని కోరారు.
 

Advertisement
 
Advertisement
Advertisement