వరకట్నానికి వివాహిత బలి | wife commits suicide over dowry issue | Sakshi
Sakshi News home page

వరకట్నానికి వివాహిత బలి

Dec 2 2016 12:24 PM | Updated on Nov 6 2018 7:56 PM

వరకట్నానికి ఓ వివాహిత బలైంది.

జగిత్యాల: వరకట్నానికి ఓ వివాహిత బలైంది. ఈ సంఘటన గొల్లపల్లి మండలకేంద్రంలోని గౌతమ్ విద్యా మందిరం సమీపంలో చోటు చేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న స్వప్న(25)కు ఏడున్నరేళ్ల క్రితం రాజు అనే వ్యక్తితో ప్రేమ వివాహం జరిగింది. వీరికి ఐదేళ్ల కుమారుడున్నాడు. పెళ్లి జరిగిన నాటి నుంచి వరకట్నం కోసం భర్త, అత్తమామలు వేధిస్తున్నారు. 
 
15 రోజుల క్రితం కూడా ఈ విషయమై గొడవలు జరిగాయి. శుక్రవారం ఉదయం చూసే సరికి స్వప్న ఉరికి వేలాడుతూ కనిపించింది. భర్త, అత్తమామలు కలిసి ఉరివేసి చంపి ఆత్మహత్యగా చిత్రీకరించారంటూ మృతురాలి తల్లి చుక్క లక్ష్మీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement