నిజామాబాద్‌లో రెండు దొంగతనాలు | two robberies in Nizamabad | Sakshi
Sakshi News home page

నిజామాబాద్‌లో రెండు దొంగతనాలు

Jun 23 2016 11:08 AM | Updated on Sep 4 2017 3:13 AM

నిజామాబాద్జిల్లా వర్ని మండలం జలాల్‌పూర్‌లో బుధవారం రాత్రి రెండిళ్లలో దొంగతనాలు జరిగాయి.

 నిజామాబాద్జిల్లా వర్ని మండలం జలాల్‌పూర్‌లో బుధవారం రాత్రి రెండిళ్లలో దొంగతనాలు జరిగాయి. గ్రామానికి చెందిన వేముల గంగాభవానీ కుటుంబసభ్యులు ఇంటికి తాళం వేసి బంధువుల ఊరికి వెళ్లారు. గుర్తు తెలియని దుండగులు ఆ ఇంటి తాళాలు పగులగొట్టి రూ.5వేల నగదుతోపాటు ఒకటిన్నర తులాల బంగారు ఆభరణాలను ఎత్తుకుపోయారు.

 

అలాగే, ఆ పక్కనే ఉన్న చింతం రాములు ఇంట్లో ప్రవేశించిన దుండగులు నిద్రిస్తున్న వారిపై మత్తు మందు చల్లి తాపీగా ఇంట్లో వస్తువులను చిందరవందర చేశారు. దాచి ఉంచిన రూ.24వేల నగదుతోపాటు రాములు కోడలు అనిత మెడలోని బంగారు గొలుసు సహా 5 తులాల బంగారు ఆభరణాలను, 5 తులాల వెండి ఆభరణాలను పట్టుకుపోయారు. బాధితుల ఫిర్యాదు మేరకు ఎస్సై అంజయ్య సంఘటన స్థలిని పరిశీలించి, దర్యాప్తు చేపట్టారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement