కృష్ణా పుష్కరాలకు ట్రాఫిక్‌ మళ్లింపు | trafic was diverted for krishna pushkaras | Sakshi
Sakshi News home page

కృష్ణా పుష్కరాలకు ట్రాఫిక్‌ మళ్లింపు

Aug 8 2016 4:44 PM | Updated on Sep 4 2017 8:25 AM

కృష్ణా పుష్కరాల నేపథ్యంలో ఈనెల 12వ తేదీ నుంచి ట్రాఫిక్‌ మళ్లింపు చర్యలు తీసుకుంటున్నట్టు ఏలూరు రేంజ్‌ డీఐజీ పీవీ రామకృష్ణ తెలిపారు.

ఏలూరు (మెట్రో): కృష్ణా పుష్కరాల నేపథ్యంలో ఈనెల 12వ తేదీ నుంచి ట్రాఫిక్‌ మళ్లింపు చర్యలు తీసుకుంటున్నట్టు ఏలూరు రేంజ్‌ డీఐజీ పీవీ రామకృష్ణ తెలిపారు. జిల్లా పోలీస్‌ కార్యాలయంలో శనివారం విలే కరుల సమావేశంలో డీఐజీ మాట్లాడారు.  చెన్నై నుంచి విశాఖ వెళ్లే వాహనాలు, విశాఖ నుంచి చెన్నై వెళ్లే వాహనాల దారి మళ్లించేందుకు మార్గాలను అన్వేషిస్తున్నామన్నారు. త్వరలోనే ట్రైల్‌ రన్‌ వేసి మార్గాలను ప్రకటిస్తామని చెప్పారు. ట్రాఫిక్‌ మళ్లింపు విషయంలో ప్రజలు సహకరించాలని కోరారు. పుష్కర యాత్రికుల వాహనాలను నిర్దేశించిన పార్కింగ్‌ స్థలాల వరకు మాత్రమే అనుమతిస్తామని చెప్పారు. ఘాట్‌ ప్రాంతంలో ప్రత్యేకంగా లోపలికి, బయటకు వేర్వేరుగా మార్గాలను ఏర్పాట్లుచేశామన్నారు. ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement