టుడే అప్‌డేట్స్ | today updates | Sakshi
Sakshi News home page

టుడే అప్‌డేట్స్

Nov 20 2016 7:24 AM | Updated on Sep 4 2017 8:38 PM

న్యూఢిల్లీలో నేటి మధ్యాహ్నం కేంద్ర మంత్రి పియుష్ గోయల్‌తో భేటీకానున్న తెలంగాణ సీఎం కేసీఆర్

  • న్యూఢిల్లీలో నేటి మధ్యాహ్నం కేంద్ర మంత్రి పియుష్ గోయల్‌తో భేటీకానున్న తెలంగాణ సీఎం కేసీఆర్
  • నేడు బ్యాంకులకు సెలవుదినం. దేశవ్యాప్తంగా కొత్తనోట్ల కొరతతో జనాలకు ఇక్కట్లు కొనసాగుతున్నాయి.
  • ప్రపంచంలో మొట్టమొదటగా ఆర్టిఫీసియల్ హార్ట్ ట్రాన్స్ ప్లాంట్ చేసిన ప్రముఖ అమెరికా వైద్యుడు డెంటన్ కూలే(96) మృతి
  • ఉత్తరప్రదేశ్‌లో ఆదివారం వేకువజామున ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. యూపీలోని దేహత్ జిల్లా కాన్పుర్ సమీపంలోని పక్హరయన్‌ వద్ద పట్నా-ఇండోర్ ఎక్స్‌ప్రెస్ రైలు 14 బోగీలు పట్టాలు తప్పడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాద ఘటనపై సీఎం అఖిలేష్ యాదవ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. హెల్ప్ లైన్ నంబర్లు: 05101072, 051621072, 05121072
  • రెండు తెలుగు రాష్ట్రాల్లో రోజురోజుకు గణనీయంగా పడిపోతున్న ఉష్ణోగ్రతలు. పలు ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు
  • నేడు(ఆదివారం) అంతర్జాతీయ బాలల హక్కుల దినోత్సవం
  • తమిళనాడు రామేశ్వరానికి చెందిన 11 మంది జాలర్లను అదుపులోకి తీసుకున్న శ్రీలంక నేవీ అధికారులు. రెండు బోట్లు కూడా సీజ్ చేశారు.
  • నేడు చైనా ఓపెన్ బ్యాడ్మింటన్ సూపర్ సిరీస్ ఫైనల్. ఫైనల్లో చైనా ప్లేయర్ సున్ యుతో తలపడనున్న భారత స్టార్ షట్లర్ పీవీ సింధు
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement