– పకడ్బందీగా పరీక్ష నిర్వహించండి
– అధికారులకు డీఆర్ఓ ఆదేశం
అనంతపురం అర్బన్: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) గ్రూప్–3 మెయిన్స్ పరీక్షలు ఆది, సోమవారాల్లో జరుగుతున్నాయని డీఆర్ఓ సి.మల్లీశ్వరిదేవి అన్నారు. ఆన్లైన్లో జరిగే ఈ పరీక్ష నిర్వహణ పకడ్బందీగా జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆమె ఆదేశించారు. పరీక్ష నిర్వహణఫై శనివారం కలెక్టరేట్లోని రెవెన్యూ భవన్లో అధికారులతో ఆమె సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఆర్ఓ మాట్లాడుతూ పరీక్షలకు 2,634 మంది అభ్యర్థులు హాజరవుతున్నారన్నారు. ఆదివారం 12 కేంద్రాల్లో జరిగే పరీక్షకు 1,735 అభ్యర్థులు, సోమవారం ఆరు కేంద్రాల్లో జరిగే పరీక్షకు 899 మంది అభ్యర్థులు హాజరవుతున్నారన్నారు.
పరీక్ష ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు జరుగుతుందన్నారు. పరీక్ష నిర్వహణకు 12 మంది లైజన్ అధికారులను నియమించామన్నారు. పరీక్షలు ఆన్లైన్లో జరుగుతున్నందున అభ్యర్థులు హాల్టికెట్తో మాత్రమే హాజరు కావాలన్నారు. పరీక్ష కేంద్రంలోకి బయోమెట్రిక్ రిజిస్ట్రేషన్ ద్వారా ఉదయం పరీక్షకు 8 గంటల నుంచి 9 గంటల వరకు, మధ్యాహ్నం పరీక్షకు 1.30 గంటల నుంచి 2.30 గంటల వరకు మాత్రమే అనుమతిస్తారన్నారు. అభ్యర్థులు పరీక్ష కేంద్రంలోకి ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులు, సెల్ఫోన్స్ తీసుకురాకూడదన్నారు. రైల్వేస్టేషన్, బస్టాండ్ నుంచి పరీక్ష కేంద్రాలకు అభ్యర్థులు చేరుకునేలా రవాణా సదుపాయాన్ని ఆర్టీసీ కల్పించిందన్నారు. లైజన్ అధికారులు అప్రమత్తంగా ఉంటూ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలన్నారు.
నేడు,రేపు గ్రూపు 3 మెయిన్స్ పరీక్ష
Published Sat, Aug 5 2017 9:21 PM
Advertisement
Advertisement
T20 World Cup 2024: భారత్ చేతిలో ఓటమి.. వెక్కి వెక్కి ఏడ్చిన పాక్ ప్లేయర్
మళ్లీ 2014 నాటి అరాచక పాలన రిపీట్ అవుతుందా?
ఏపీ రాజధానిగా అమరావతి: చంద్రబాబు
సెన్సేషన్ సోఫియా.. తండ్రిపై అవినీతి కేసు, ఇంట్రెస్టింగ్ బ్యాక్గ్రౌండ్
ఏపీలో కుప్పకూలిన రాజ్యాంగ వ్యవస్థలు: వైఎస్ జగన్
యానిమల్ బ్యూటీ కొత్త బంగ్లా.. ధరెంతో తెలుసా?
భూకంపాన్ని తట్టుకునే ఇల్లు.. ఇది కదా అసలైన టెక్నాలజీ అంటే!
పాయే.. మళ్లీ చైనా పరువు పాయే!
ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు ముమ్మరం
రిలేషన్ షిప్ పై కామెంట్స్ చేసిన హెబ్బా పటేల్..
వైఎస్ఆర్ సీపీ మేయర్ కు అరుదైన గౌరవం
మదర్స్ కి ఇచ్చే ఇంపార్టెన్స్ ఫాదర్స్ కి ఇవ్వట్లేదు ఈ సొసైటీ
సినిమా ఫ్లాప్ అయితే పార్టీ చేసుకుంటా: రామ్ చరణ్
'పుష్ప' విలన్ మామూలోడు కాదు.. రెమ్యునరేషన్ వింత కండీషన్స్!
చూసే కళ్ళు బాగుంటే అందరూ బాగుంటారు.. జడ్జ్ గా చేయడం అంటే
రైలు ప్రమాదంపై మమతా బెనర్జీ ట్వీట్
ఐస్క్రీమ్లో మనిషి వేలు : కంపెనీ లైసెన్స్ రద్దు
గుడ్ న్యూస్.. భారీగా పడిపోయిన బంగారం.. నేటి ధరలు ఇవే..!
తప్పక చదవండి
- హీరో దర్శన్ అరెస్ట్.. సంబంధం లేదని తేల్చేసిన మరో కన్నడ హీరో
- కరివేపాకులు ఆరు నెలలు వరకు నిల్వ ఉండాలంటే..!
- T20 వరల్డ్కప్లో సూపర్-8 బెర్త్లు ఖారారు.. షెడ్యూల్ ఇదే
- కానిస్టేబుల్ సురేష్కు సీఎం రేవంత్ అభినందన.. కారణం ఇదే..
- ఈ వారం ఓటీటీల్లో 20 సినిమాలు రిలీజ్.. ఆ రెండు స్పెషల్!
- జమ్ము కశ్మీర్: భద్రతా బలగాల కాల్పుల్లో ఉగ్రవాది మృతి
- అనంతపురం మేయర్కు అరుదైన గౌరవం
- ఢిల్లీలో రెడ్ అలర్ట్..‘బయటికెళ్లొద్దు.. మంచినీరు తాగండి’
- పన్నూ కేసు: భారత వ్యక్తి అమెరికాకు అప్పగింత!
- సిక్ప్యాక్! లుక్ కోసమైతే ఫసక్కే
Advertisement