చికిత్స పొందుతూ తిరుమలరావు మృతి | tirulalarao died at ongole rims hospital | Sakshi
Sakshi News home page

చికిత్స పొందుతూ తిరుమలరావు మృతి

Oct 3 2015 6:30 PM | Updated on Sep 3 2017 10:23 AM

ఒంగోలు రిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తిరుమలరావు అనే వ్యక్తి మృతిచెందాడు.

ఒంగోలు : గత ఐదు రోజుల నుంచి ఒంగోలు రిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తిరుమలరావు శనివారం నాడు మృతిచెందాడు. ప్రకాశం జిల్లా వలేటివారిపాలెం మండలం పోకూరులో ఐదురోజుల కిందట మనుసాగర్ అనే బాలుడిని క్షుద్రపూజల కోసం తిరుమలరావు బలిచ్చాడు. విషయం తెలుసుకున్న స్థానికులు తిరుమలరావుపై ఆగ్రహంచి, కిరోసిన్ పోసి నిప్పుపెట్టగా తీవ్ర గాయాలపాలైన విషయం విదితమే. అప్పటినుంచి ఒంగోలు రిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తిరుమలరావు శనివారం సాయంత్రం మృతిచెందాడు.

Advertisement
 
Advertisement
Advertisement