మెదక్ ఘటనలో ఇద్దరు క్షతగాత్రులు యశోదకు | The moved two casualties in the Medak accident to Yashoda | Sakshi
Sakshi News home page

మెదక్ ఘటనలో ఇద్దరు క్షతగాత్రులు యశోదకు

May 2 2016 9:51 AM | Updated on Oct 16 2018 3:12 PM

మెదక్ జిల్లా కంగ్టి మండలం పరిధిలో ఆదివారం రాత్రి పెళ్లి బృందం లారీకి విద్యుత్ హైటెన్షన్ వైర్లు తాకిన ఘటనలో తీవ్రంగా గాయపడిన ఇద్దరు క్షతగాత్రులను సికింద్రాబాద్ యశోద ఆస్పత్రికి పోలీసులు తరలించారు.

మెదక్ జిల్లా కంగ్టి మండలం పరిధిలో ఆదివారం రాత్రి పెళ్లి బృందం లారీకి విద్యుత్ హైటెన్షన్ వైర్లు తాకిన ఘటనలో తీవ్రంగా గాయపడిన ఇద్దరు క్షతగాత్రులను సికింద్రాబాద్ యశోద ఆస్పత్రికి పోలీసులు తరలించారు. వల్లభాయ్ (40), రుక్కాభాయ్ (38)లకు తీవ్ర కాలిన గాయాలు కావడంతో మెరుగైన వైద్యం కోసం నారాయణఖేడ్ ప్రభుత్వ ఆస్పత్రి నుంచి యశోద ఆస్పత్రికి తరలించారు. వీరికి ఎస్‌ఐసీయూలో వైద్యం అందిస్తున్నారు. 30 శాతానికి పైగా కాలిన గాయాలతో బాధపడుతున్న వల్లభాయ్ పరిస్థితి విషమంగా ఉంది.

 

Advertisement
 
Advertisement
Advertisement