సింగపూర్లో నాలుగు రోజుల కిందట యువకుడి మృతి
ఇప్పటికీ తెలియని వివరాలు
ఉద్యోగానికి పంపిన సంస్థ నిర్వాహకునిపై బాధితుల ఆగ్రహం
వన్టౌన్లో భారీ ధర్నా, రాస్తారోకో
బాధితులకు వైఎస్సార్ సీపీ నేతల అండ
పాతపోస్టాఫీసు : విదేశాలలో మృతిచెందిన యువకుడి వివరాల కోసం అతని తల్లిదండ్రులు, బంధువులు సోమవారం ఆందోళనకు దిగారు. పాతనగరంలో ధర్నా, రాస్తారోకో చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. వివరాల్లోకి వెళ్తే... నగరానికి చెందిన చింతకాయల మహేష్ ఈ నెల 22న సింగపూర్లో మృతి చెందిన విషయం తెలిసిందే. యువకుడిని సింగపూర్కు పంపించిన గ్లోబల్ టెక్నికల్ ట్రైనింగ్ సెంటర్ నిర్వాహకుడు తమ్మిరెడ్డి జనార్దన్ గత రెండు రోజులుగా సమాధానం చెప్పకపోవడంతో బాధితుల్లో ఆగ్రహం పెరిగిపోయింది. ఇప్పటికే మరణవార్త విని నాలుగు రోజులైందని, తమ కుమారుడి పరిస్థితి ఎంటో తెలియడం లేదని మహేష్ తల్లిదండ్రులు బంగారయ్య, పోలమ్మ కన్నీటిపర్యంతమవుతున్నారు. స్థానిక ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్కుమార్ను కలుసుకుని తమ బాధను వెల్లడిస్తే సంస్థ యజమానికి అనుకూలంగా మాట్లాడుతున్నారని, తమ గోడును పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
నోరు విప్పని జనార్దన్
సింగపూర్లో ఉద్యోగం ఇప్పించిన జనార్దన్ నోరు విప్పకపోవడంతో మహేష్ మృతిపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. విదేశాలలో మంచి ఉద్యోగాలు ఇప్పిస్తానని జనార్దన్ ఇప్పటికే పలువురు యువకుల వద్ద లక్షలాది రూపాయలు వసూలు చేశాడనే ఆరోపణలు ఉన్నాయి. ఉన్నత ఉద్యోగాల పేరిట విదేశాల్లో కూలి పనులకు పెట్డాడని, ఇటువంటి మోసగాడిని పోలీసులు అరెస్టు చేయాలని మహేష్ బంధువులు డిమాండ్ చేశారు. శిక్షణ పేరిట యువకులతో సంస్థలో వెట్టిచాకిరీ చేయిస్తున్నాడని ఆరోపించారు. ధర్నా శిబిరం వద్ద జరుగుతున్న విషయాలను తెలుసుకునేందుకు సంస్థ యజమాని జనార్దన్ ఒక యువకుడిని అక్కడ ఉంచాడు. ధర్నా వద్ద జరిగే ప్రతి విషయాన్ని ఆ యువకుడు సెల్ఫోన్లో వీడియో చిత్రించి పంపుతుండగా పట్టుకున్న మహేష్ స్నేహితులు మరింతగా ఆగ్రహించి సంస్థ మీద దాడి చేసేందుకు ప్రయత్నించారు. ఒకటో పట్టణ పోలీసులు సంఘటనా స్థలాన్ని చేరుకుని పరిస్థితిని అదుపుచేశారు. పట్టు వదలని బాధితులు రాస్తా రోకో నిర్వహించి ట్రాఫిక్ను స్తంభింపచేశారు. సీఐ వెంకటరావు జోక్యం చేసుకుని బాధితులకు నచ్చచెప్పడంతో రాస్తారోకో విరమించారు. డాక్టర్ జహీర్ అహ్మద్, యువభారత్ ఫోర్స్ అధ్యక్షుడు మహ్మద్ సాదిక్లు బాధితులకు అండగా నిలిచారు.
మృతుని కుటుంబీకులతో చర్చలు
మృతుడు మహేష్ కుటుంబానికి చెందిన పెద్దలతో పాటు డాక్టర్ జహీర్ అహ్మద్, మహ్మద్ సాదిక్, ముత్యాలమ్మపాలెం సర్పంచ్ డి.ధనలక్ష్మి, డి.అచ్చిబాబు హార్బర్ పోలీస్ స్టేషన్లో జనార్దన్ పంపిన ప్రతినిధితో చర్చలు జరిపారు. రాత్రి వరకూ కొనసాగిన చర్చలు పూర్తిగా విఫలం కావడంతో బాధితులు వెనుతిరిగారు.
వైఎస్సార్ సీపీ నేతల భరోసా
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ ధర్నా శిబిరానికి చేరుకుని బాధితులను పరామర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని, న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఆయనతోపాటు విశాఖ దక్షిణ, పెందుర్తి నియోజకవర్గాల సమన్వయకర్తలు కోలా గురువులు, అన్నంరెడ్డి అదీప్రాజు, రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ, నగర మైనార్టీ సెల్ అధ్యక్షుడు మహ్మద్ షరీఫ్, 25వ వార్డు అధ్యక్షుడు సూరాడ తాతారావు ఉన్నారు.
పాతనగరంలో తీవ్ర ఉద్రిక్తత
Published Sat, Jan 7 2017 1:52 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
హోం ఓటింగ్ పరిశీలన
నిప్పుతో చెలగాటమా!
మాదిగలను మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ
‘రాహుల్ పేరు చెబితే ఓట్లు పడవు’
కాంగ్రెస్తోనే అన్నివర్గాలకు సముచిత న్యాయం
హామీలు నెరవేర్చడంలో రేవంత్ విఫలం
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
హామీల అమలులో కాంగ్రెస్ విఫలం
పార్లమెంట్ ఎన్నికలు బహిష్కరిస్తాం..
మూడోసారి మోదీ సర్కారే..
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement