కరువులోనూ పర్యటించరా?: తమ్మినేని | Tammineni fires on both sate CMs | Sakshi
Sakshi News home page

కరువులోనూ పర్యటించరా?: తమ్మినేని

Apr 19 2016 4:04 AM | Updated on Aug 13 2018 8:10 PM

కరువులోనూ పర్యటించరా?: తమ్మినేని - Sakshi

కరువులోనూ పర్యటించరా?: తమ్మినేని

తీవ్ర కరువు పరిస్థితుల్లో కూడా మంత్రులు, ఎమ్మెల్యేలు క్షేత్రస్థాయిలో పర్యటించకపోవడం దారుణమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ధ్వజమెత్తారు.

తిప్పర్తి: తీవ్ర కరువు పరిస్థితుల్లో కూడా మంత్రులు, ఎమ్మెల్యేలు క్షేత్రస్థాయిలో పర్యటించకపోవడం దారుణమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ధ్వజమెత్తారు. సీపీఎం ఆధ్వర్యంలో చేపట్టిన కరువు పర్యటనలో భాగంగా సోమవారం నల్లల్లొండ జిల్లా తిప్పర్తి మండలం మాడ్గులపల్లి, ఇందుగుల గ్రామాలలో ఎండిన బత్తాయి తోటలను పరిశీలించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రెండు రాష్ట్రాల్లో ఇద్దరు చంద్రులు వారి కుటుంబాల మేలు కోసమే పరిపాలన చేస్తున్నారని ఎద్దేవా చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement