-
ఆకలి కేకలు.. దయనీయ స్థితిలో ఉత్తర కొరియా
పైన పటారం, లోన లొటారం అన్నట్టుగా తయారైంది ఉత్తర కొరియా పరిస్థితి. అధ్యక్షుడు కిమ్ వరుస క్షిపణి పరీక్షలతో దాయాది దక్షిణ కొరియాకు, దాని మద్దతుదారు అమెరికాకు సవాళ్లు విసురుతుంటే దేశం మాత్రం కనీవినీ ఎరుగని కరువు కోరల్లో చిక్కి అల్లాడుతోంది. తిండికి లేక జనం అలమటిస్తున్నారు. తక్షణం దిద్దుబాటు చర్యలకు దిగకుంటే 1990ల్లో దేశం చవిచూసిన 20 లక్షల పై చిలుకు ఆకలి చావుల రికార్డు చెరిగిపోయేందుకు ఎంతోకాలం పట్టదంటూ ఆందోళన వ్యక్తమవుతోంది...! అటు కాలం కనికరించడం లేదు. తీవ్ర వరదలు, ప్రతికూల వాతావరణ పరిస్థితులతో గతేడాది పంట దిగుబడులు కుదేలయ్యాయి. ఇటు ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. అంతో ఇంతో ఆదుకుంటూ వచ్చిన ప్రజా పంపిణీ వ్యవస్థ చేతులెత్తేసింది. ఇంతకాలం మార్కెట్లో దొరుకుతూ వచ్చిన చైనా తిండి గింజలు, నిత్యావసరాలు కరోనా కట్టడి దెబ్బకు మూడేళ్లుగా అసలే అందుబాటులో లేకుండా పోయాయి. దాంతో ఉత్తర కొరియా అక్షరాలా ఆకలి కేకలు పెడుతోంది. జనాభాలో అధిక శాతం రోజుకు ఒక్క పూట కూడా తిండికి లేక అలమటిస్తున్నారు. నియంతృత్వపు ఇనుప తెరలు దాటుకుని ఏ విషయమూ బయటికి రాదు గనుక అధికారిక గణాంకాలు అందుబాటులో లేవు. కానీ ఇప్పటికే లక్షలాది మంది కరువు బారిన పడ్డట్టు అంతర్జాతీయ సంస్థలు అంచనా వేస్తున్నాయి. కరువు మరణాల సంఖ్య కూడా నానాటికీ పెరుగుతున్నట్టు చె బుతున్నాయి. అస్తవ్యస్త పాలనకు మారుపేరైన కిమ్ ప్రభుత్వమే ఇందుకు ప్రధాన దోషిగా కనిపిస్తోంది. కారణాలెన్నో... ► కొరియా కరువుకు చాలా కారణాలున్నాయి. కరోనా దెబ్బకు ఆహార కొరత తీవ్రతరమైంది. ► ప్రభుత్వం తీవ్ర ఆంక్షలను విధించి అత్యంత కఠినంగా అమలు చేయడం, సరిహద్దులను పూర్తిగా మూసేయడంతో సమస్య మరింత పెరిగింది. 2.5 కోట్ల జనాభా ఆహార అవసరాలు తీర్చడానికి కనీసం 55 లక్షల టన్నుల ఆహార ధాన్యాలు అవసరం. కాగా వార్షిక సగటు ఉత్పత్తి 45 లక్షల టన్నులే. మిగతా 10 శాతం లోటు చాలావరకు చైనాతో సాగే అనధికారిక వర్తకం ద్వారా పూడేది. తిండి గింజలు, నిత్యావసరాలతో పాటు పలు ఇతర చైనా సరుకులు 2020 దాకా దేశంలోకి భారీగా వచ్చేవి. ముఖ్యంగా గ్రామీణుల అవసరాలు చాలావరకు వీటిద్వారానే తీరేవి. కానీ మూడేళ్లుగా ఆంక్షల దెబ్బకు ఈ వర్తకం దాదాపుగా పడకేసింది. ఇది సగటు కొరియన్లకు చావుదెబ్బగా మారింది. దీనికి తోడు గతేడాది తిండి గింజల ఉత్పత్తి 35 లక్షల టన్నులకు మించకపోవడం పరిస్థితిని మరింత దిగజార్చింది. ► ప్రభుత్వం వద్ద భారీగా ఆహార నిల్వలు అందుబాటులో ఉన్నాయి. ఇటీవలే చైనా నుంచి భారీగా బియ్యం, గోధుమ పిండి తదితరాలను దిగుమతి చేసుకుంది కూడా. కానీ ‘ముందుజాగ్రత్త’ చర్యల్లో భాగంగా వాటిని కావాలనే దాచి ఉంచిందని పరిశీలకులు చెబుతున్నారు. ఫలితంగా నిత్యావసరాల ధరలు చుక్కలనంటుతున్నాయి. ప్రజల్లో చాలామందికి కొనుగోలు శక్తి క్షీణించడంతో వారికి అందుబాటులో లేకుండా పోతున్నాయి. కిలో బియ్యం ధర ఏకంగా 220 రూపాయలకు ఎగబాకిందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు! ► వ్యవసాయ రంగంలో సమూల మార్పులు తెచ్చి దేశాన్ని స్వయంసమృద్ధంగా మార్చుకుంటామంటూ తాజాగా జరిగిన 4 రోజుల వర్కర్స్ పార్టీ సమావేశాల్లో కిమ్ గంభీరంగా ఉపన్యాసమిచ్చారు. అది ఏ మేరకు వాస్తవ రూపు దాలుస్తుందన్న దానిపైనే కొరియన్ల భవితవ్యం ఆధారపడుతుంది. తీవ్ర అసమానతలు ► ఉత్తర కొరియా ప్రపంచంలోని అత్యంత నిరుపేద దేశాల జాబితాలో ఉంది. ప్రజల తలసరి ఆదాయం కేవలం రూ.1.3 లక్షలు! ► దేశంలో సామాజిక అసమానతలు చాలా ఎక్కువ. ► అత్యధికులకు, ముఖ్యంగా గ్రామీణులకు అన్నం, కాయగూరలే ప్రధానాహారం. ► మాంసాహారం, పండ్లు వారికి అందని ద్రాక్షే. ► పట్టణాల్లో పరిస్థితి కాస్త మెరుగు. రాజధాని ప్యాంగ్యాంగ్లో స్థోమత ఉంటే అన్నిరకాల ఆహారమూ దొరుకుతుంది. ► దేశంలో ప్రైవేట్లో ఆహారం, ఆహార ధాన్యాల అమ్మకం నిషిద్ధం. కానీ కొన్నేళ్లుగా ప్రజా పంపిణీ వ్యవస్థ పూర్తిగా కుదేలైంది. దాంతో ప్రైవేట్ క్రయ విక్రయాలను ప్రభుత్వం చూసీ చూడనట్టు పోతోంది. నిధులన్నీ సైన్యానికే! ► ఉత్తర కొరియా 12 లక్షల మందితో కూడిన ప్రపంచంలోనే నాలుగో అతి పెద్ద సైన్యాన్ని పోషిస్తోంది. ► ఏటా జీడీపీలో ఏకంగా నాలుగో వంతు సైన్యంపైనే వెచ్చిస్తోంది. ► 2022లోనైతే దేశ చరిత్రలోనే అత్యధికంగా దాదాపు 70 ఖండాంతర, క్రూయిజ్ క్షిపణులను పరీక్షించింది! ► తన సైనిక సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటేందుకు ఇటీవలే భారీ సంఖ్యలో ఖండాంతర క్షిపణులు తదితరాలతో నెల రోజుల క్రితమే అతి పెద్ద సైనిక పరేడ్ను నిర్వహించింది! ► ఇలా వనరులన్నీ రక్షణ రంగానికే మళ్లుతుండటంతో వ్యవసాయ రంగానికి ప్రాధాన్యం దక్కకుండా పోతోంది. ► కిమ్ అణు పరీక్షల కారణంగా ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు విధించిన ఆంక్షలతో పరిస్థితి మరింత విషమించింది. ► కేవలం గతేడాది క్షిపణి పరీక్షలకు వెచ్చించిన నిధులతో దేశ జనాభా మొత్తానికీ ఏడాది పాటు చాలినన్ని తిండి గింజలు అందించవచ్చని అంచనా. ఆ కరువుకు 20 లక్షల మంది బలి! 1990ల్లో ఉత్తర కొరియా చవిచూసిన భయానక కరువు గురించి ఇప్పటికీ కథలు కథలుగా చెప్పకుంటారు. ‘ఆర్డియస్ మార్చ్’గా పిలిచే ఈ కరువుకు అస్తవ్యస్త పాలన, సోవియట్ నుంచి సాయం ఆగిపోవడంతో పాటు 1995లో వచ్చిన భారీ వరదలు తక్షణ కారణంగా మారాయి. వాటి దెబ్బకు దేశంలో వరి పంట దాదాపుగా తుడిచిపెట్టుకుపోయింది. నాలుగో వంతుకు పైగా పొలాలు రోజల తరబడి అడుగుల లోతు నీటిలో మునిగిపోయాయి! జనమంతా పనీపాటా వదిలేసి కేవలం తిండి గింజల కోసం రోజుల తరబడి పొలాల వెంబడి తిరుగుతూ అలమటించిన దృశ్యాలు అప్పట్లో అందరినీ కలచివేశాయి. కనీవినీ ఎరగని ఆ కరువుకు రెండు కోట్ల జనాభాలో పదో వంతుకు పైగా, అంటే 20 లక్షల మందికి పైగా బలైనట్టు చెబుతారు. అంతేగాక ఏకంగా 62 శాతం మందికి పైగా చిన్నారులు పౌష్ఠికాహార లోపానికి గురై శాశ్వత ఆరోగ్య తదితర సమస్యల బారిన పడ్డారు. రెండు మూడేళ్ల తర్వాత పరిస్థితి అదుపులోకి వచ్చినా చిన్నారులు మాత్రం కోలుకోలేకపోయారు. నేటికీ ఉత్తర కొరియాలో 22 శాతం మంది బాలలు పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నట్టు అంచనా! – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఖరీఫ్ సాగులో రైతులు బిజీ
సదాశివపేట రూరల్:రెండేళ్లుగా వర్షాలు లేక తీవ్ర కరువుతో సతమతమైన రైతులు ఈ సంవత్సరం వర్షాలు సమృద్ధిగా కురవటంతో మండలంలోని రైతులు ఖరీఫ్ సాగులో బిజీగా ఉన్నారు. పొలాలు, పత్తి చేలల్లో గుంటుక, పిచికారీ, కలుపుతీత పనుల్లో నిమగ్నమయ్యారు. ఖరీఫ్ మొదలై రెండు మాసాలు గడుస్తున్న నేపథ్యంలో పంటల సంరక్షణ చర్యల్లో భాగంగా రైతులు పంటలను కంటికి రెప్పల్లా కాపాడుకుంటున్నారు. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్కుగాను మండలంలోని రైతాంగం పత్తిని ఎక్కువగా సాగు చేస్తుండగా మిగతా పంటలను మోస్తరుగానే సాగు చేస్తున్నారు. మండలంలో వరి 220 హెక్టార్లు, పత్తి 8900 హెక్టార్లు, మొక్కజొన్న 350, పెసర 380, కంది 800, సోయాబీన్ 450, మినుము 290, ఇతర పంటలు 1500 హెక్టార్లలో సాగు చేశారు. మొత్తం కలిపి మండలంలో 12890 హెక్టార్లలో రైతులు పంటలు సాగు చేశారు. మన తెలంగాణ మన వ్యవసాయం సదస్సులో వ్యవసాయ అధికారులు రైతులకు పత్తికి ప్రత్యామ్నాయంగా పప్పు ధాన్యాలు సాగు చేసుకోవాలని సూచించినా రైతుల్లో మార్పు కనిపించలేదు. వ్యవసాయ పనుల్లో రైతులు నిమగ్నం.. ఖరీఫ్ వరుసగా వర్షాలు కురస్తుండటంతో రైతులు పంటల సాగు, సస్యరక్షణచర్యల్లో బిజీగా ఉన్నారు. పత్తి, మొక్కజొన్న, కంది పంట చేనులు కలుపుతీతకు వచ్చాయి. దీంతో రైతులు కూలీలతో కలుపు పనులు చేయిస్తున్నారు. కలుపు పనుల కారణంగా గ్రామాల్లో కూలీలకు డిమాండ్ పెరిగింది. కొందరు రైతులు పక్క గ్రామాల్లోని కూలీలను అదనంగా డబ్బుల చెల్లించి మరీ వ్యవసాయ పనులు చేయించుకుంటున్నారు. మొదట పత్తి విత్తనాలు విత్తే సమయంలో కూలీ ఒక్కక్కరికి రూ.250 వరకు చెల్లించారు. ఇప్పుడు కలుపుతీత పనులకు సైతం రైతులు అంతేమొత్తం కూలీలకు చెల్లించాల్సివస్తోంది. కొందరు రైతులు కలుపు తీయిస్తుంటే మరికొంత మంది పొలంలో గుంటుక తొలుతున్నారు. చేలల్లో కలుపు పూర్తయిన రైతులు పంటకు యూరియా, డీఏపీ లాంటి ఎరువులను చల్లే పనిలో నిమగ్నమవుతున్నారు. ఇప్పటి వరకు మండలంలో 40 శాతం వరినాట్ల పనులు పూర్తి కాగా ఇంకా 60 శాతం నాట్లు వేయాల్సి ఉంది. ఇంతవరకు వరినాట్లు వేయని రైతులు ఈనెల మూడో వారంవరకు నాట్లు వేసుకోవచ్చు. నాటు వేసుకోవటం ఆలస్యమైతే వరి పంట దిగుబడి తగ్గే అవకాశాలు ఉంటాయి. రైతులు త్వరగా వరి నాట్లు వేసుకోవాలి. -మూడో వారం వరకు నాట్లు వేసుకోవచ్చు బాబూనాయక్, ఏఓ -
నీటి నిరక్షరాస్యతే కరువుకు మూలం!
‘జల గాంధీ’ అయ్యప్ప మెసగితో ప్రత్యేక ఇంటర్వ్యూ - కరువుకు మూల కారణం వర్షాలు కురవక పోవడం కాదు.. ‘నీటి నిరక్షరాస్యతే’ అసలు సమస్య - పొలాల్లో లోతు కందకాలు, పట్టా బండింగ్తో స్వల్ప ఖర్చుతోనే వాన నీటి సంరక్షణ.. సీజనల్ పంటలకు నీటి భరోసా - చెక్ డ్యామ్లు వృథా.. నదులు/ వాగులలో భూగర్భ చెక్ డ్యామ్లతో సాగు, తాగునీటి భద్రత - స్నానం చేసిన నీటిని, రోడ్డుపైన కురిసే వాన నీటిని కూడా నేలకు తాపితే.. పట్టణాలు, నగరాల్లో పుష్కలంగా భూగర్భ జలాలు - వాన నీటిలో 30 శాతాన్ని భూమిలోకి ఇంకింపజేస్తే నీటి దారిద్య్రం పరార్! అయ్యప్ప మెసగి! వన్ మాన్ వాటర్ ఆర్మీ!! ఆయన వయసు 59 ఏళ్లు. 30 ఏళ్లుగా వాన నీటి సంరక్షణ తపస్సు చేస్తున్నారు. కరువు ప్రాంతమైన ఉత్తర కర్ణాటకలో సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన అయ్యప్ప మెసగి.. దక్షిణాదిలో జల సంరక్షణ ఉద్యమానికి ప్రతీకగా నిలిచారు. ఎల్ అండ్ టిలో మెకానికల్ ఇంజినీరుగా 23 ఏళ్లు పనిచేసిన అయ్యప్ప.. 2002లో నెలకు రూ. 32 వేల జీతంతో కూడిన ఉద్యోగాన్ని తృణప్రాయంగా వదిలేసి.. వాన నీటి సంరక్షణోద్యమంలోకి దూకారు. నలుగురు పిల్లలు, భార్య మాట కాదని కుటుంబ ప్రయోజనం కన్నా సామాజిక ప్రయోజనమే మిన్నగా భావించిన సాహసి ఆయన. వాన నీటి సంరక్షణ ప్రాధాన్యత గురించి, సంరక్షణ పద్ధతుల గురించి రైతులకు, ప్రజలకు కాలికి బలపం కట్టుకొని ప్రచారం చేస్తున్నారు. ఆర్థిక బాధలు, అవమానాలు, కష్టనష్టాలు ఎదురైనా వెనుదిరగలేదు. బాల్యంలో తమ కుటుంబం సాగు నీటికి, తాగునీటికి పడిన కష్టాలు అయ్యప్పలో రగిలించిన కసి ఆయనను అసాధారణ శక్తిగా రూపుదిద్దింది. స్వచ్ఛంద సంస్థలు ఇచ్చిన ఊతంతో ఆర్థికంగా నిలదొక్కుకొని.. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో వాన నీటి సంరక్షణపై అనితరసాధ్యమైన వినూత్న పద్ధతులను ఆవిష్కరించారు. ఈ విజయాలే ఆయనను ‘జల గాంధీ’గా మలిచాయి. రైతులను, ప్రజలను అష్టకష్టాల పాలుచేస్తూ జాతి మూలుగను నిలువునా పీల్చేస్తున్నది కరువు రక్కసేనని సాధారణంగా అనుకుంటూ ఉంటాం. కానీ, ఆయన మాత్రం.. వర్షపు నీటి సంరక్షణపై నిర్లక్ష్యం, భావదారిద్య్రమే సాగునీటి, తాగునీటి కష్టాలకు మూల కారణమని తేల్చేస్తున్నారు. వాన కురవకా కాదు.. నీరు లేకా కాదు.. నీటి సంరక్షణకు సంబంధించిన భావ దారిద్య్రమే అసలు సమస్య అని అయ్యప్ప స్పష్టం చేస్తున్నారు. అకుంఠిత దీక్షతో ఆయన చేస్తున్న విశిష్ట కృషికి గుర్తింపుగా తొలుత వినూత్న ఆవిష్కరణలను ప్రోత్సహించే అశోక ఫెలోషిప్ లభించింది. జమ్నాలాల్ బజాజ్ జాతీయ పురస్కారం వంటి అవార్డులతోపాటు ఐఐటి అహ్మదాబాద్ ‘డాక్టర్ ఆఫ్ డ్రై బోర్వెల్స్’, ‘జల గాంధీ’ వంటి బిరుదులు పొందిన కారణ జన్ముడు అయ్యప్ప మసగితో ‘సాగుబడి’ డెస్క్ ఇన్చార్జ్ పంతంగి రాంబాబు సంభాషించారు. కొన్ని ముఖ్యాంశాలను ఇక్కడ పొందుపరుస్తున్నాం.. తీవ్ర కరువు పరిస్థితుల వల్ల సాగు నీటికి, తాగు నీటికి కూడా సమాజం అల్లాడుతోంది. దీనికి మూల కారణం నీటి నిరక్షరాస్యతే అని మీరంటున్నారు.. అంటే ఏమిటి? అయ్యప్ప మసగి : వర్షాల తీరులో అనిశ్చితి పెరిగింది. వాతావరణ మార్పుల వల్ల వర్షానికి వర్షానికి మధ్య గ్యాప్ రావడం లేదా కుండపోతగా కురవడం సాధారణమై పోయింది. అయితే, గతంలో కన్నా ఎక్కువ వర్షం కురుస్తున్నప్పటికీ ఆ నీటిని మనం జాగ్రత్త చేసుకోవడం లేదు. అయితే, పూర్వం మన పొలాల్లో నీటి కుంటలుండేవి. పూడ్చేశాం. గ్రామ చెరువుల్లోకి నీరు చేరనంతగా నిర్లక్ష్యం చేశాం, ఆక్రమించేశాం. నీటిని పొలంలో గానీ, ఇళ్ల దగ్గర గానీ భూమిలోకి ఇంకే మార్గాలన్నీ మూసేశాం. కురిసిన వానలో 3 శాతం నీరు మాత్రమే భూమిలోకి ఇంకుతోంది. మిగతా నీరు వాగులు, నదుల్లోకి వదిలేస్తున్నాం. నదులపై ఆనకట్టలు, లిఫ్ట్లు పెట్టి పొలాలకు, తాగడానికి వెనక్కి తెచ్చుకుంటున్నాం. సరస్సులన్నిటినీ మురుగునీటి కుంటలుగా మార్చేశాం. ఎంత వర్షం కురిసినా రెండు నెలల్లో తాగడానికి నీరు లేని పరిస్థితి వచ్చింది. ఒక్క మాటలో చెప్పాలంటే.. అభివృద్ధి పేరుతో నీటి ఎద్దడిని మనమే సృష్టించుకుంటున్నాం. వాన, నీరు సమస్య కాదు.. మన ఆలోచనా ధోరణిలోనే సమస్య ఉంది. ఒక ఏడాది కురిసే వానలో కనీసం 30 శాతాన్ని సంరక్షించుకుంటే.. ఆ తర్వాత మూడేళ్లు నీటికి కరువుండదు. వాన నీటి సంరక్షణేకరువుకు అసలైన, శాశ్వతమైన పరిష్కారం. ఇందుకోసం నీటి నిరక్షరాస్యతపై 30 ఏళ్లుగా ఒంటరి యుద్ధం చేస్తున్నా. 2020 నాటికి దేశం మొత్తాన్నీ నీటి సమృద్ధ దేశంగా మార్చాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నా. సమాజం కళ్లు తెరచి అందుకోవాలి. వాన నీటి సంరక్షణ ఎన్ని పద్ధతుల్లో చేయాలి? ఎక్కడెక్కడ చేయాలి? అయ్యప్ప మసగి : నేలతల్లి అతిపెద్ద వాటర్ ట్యాంక్. కానీ, అదేపనిగా తోడేయడం, ఇంకకుండా చేయడం వల్ల భూగర్భం ఖాళీ అయ్యింది. ఇప్పుడు మన కర్తవ్యం ఏమిటంటే.. ఎక్కడ కురిసినా, ఎంత కురిసినా, ఎలా కురిసినా ఒడిసిపట్టుకొని, శుద్ధిచేసి, భూమిలోకి పంపాలి. పొలాల్లో, రోడ్ల మీద, గృహ సముదాయాల్లో, పారిశ్రామిక సంస్థల స్థలాల్లో.. నీరు నేల మీద పడే ప్రతి చోటా ఉద్యమ స్ఫూర్తితో నీటిని భూమికి తాపాలి. కందకాలు, కుంటలు, సోక్ పిట్లు, బోర్వెల్ రిచార్జ్ పిట్లు నిర్మించి సాధ్యమైనంత ఎక్కువ నీటిని భూమికి తాపించాలి. డాబా ఇళ్ల పైన కురిసే నీటిని పట్టుకొని, ఫిల్టర్ చేసి తాగునీటిగా వాడాలి. ముప్పయ్యేళ్లుగా మేం తాగుతున్నాం. స్నానం చేసిన నీటిని కూడా కాలువలోకి వదలకుండా.. ఇంటి దగ్గరే భూమిలోకి ఇంకింపజేయాలి. గజం భూమి వృథా కాకుండా ఈ పనిచేయొచ్చు. భూమిపైన నిర్మించే వాటర్షెడ్ల కన్నా.. నదులు, వాగుల్లో ఇసుక కింద వాటర్ షెడ్లు నిర్మించడం నేను కనుగొన్న గొప్ప ప్రభావశీలమైన నీటి సంరక్షణ పద్ధతి (వివరాల కోసం ప్రత్యేక బాక్స్లు చూడండి). ఇటువంటి 150 వరకు ప్రత్యేక పద్ధతులను రూపొందించి, పరీక్షించి సత్ఫలితాలు పొందాను. ఉద్యోగం మానేసి ఉద్యమం ప్రారంభించడానికి స్ఫూర్తి కలిగించిందేమిటి? అయ్యప్ప మసగి : పెద్దయి, ఆర్థికంగా స్థిరపడిన తర్వాత ఉద్యోగం మానేసి నీటి సమస్యకు పరిష్కారం కనుగొనాలని చిన్నప్పుడే అనుకున్నా. కేంద్ర ప్రభుత్వ సంస్థ బీఈఎంఎల్లో కొంతకాలం, తర్వాత 23 ఏళ్లు ఎల్ అండ్ టిలో మెకానికల్ ఇంజినీర్గా పనిచేశా. కర్ణాటకలో ఒక ఔషధ కంపెనీ వ్యర్థ జలాలను పొలాల్లో ఎండిపోయిన బోర్లలో పోయడం వల్ల రెండు కిలోమీటర్ల దూరంలో భూగర్భ జలాలు పనికిరాకుండా పోయాయి. ఆ రైతుల నీటి బాధలు చూడలేక 2002లో భార్యకు కూడా చెప్పకుండా రూ. 32 వేల నెల జీతం వచ్చే ఉద్యోగం మానేశా. రూ. 5 వేలకు నీటి సంరక్షణ కోసం ఒక స్వచ్ఛంద సంస్థలో చేరా. నా భార్య మిషన్పై దుస్తులు కుట్టి సంపాదించిన డబ్బుతో నలుగురు పిల్లలనూ పోషించింది. ఆమె సహాయ నిరాకరణతో ఎన్నో అవమానాలను, కష్టనష్టాలు ఎదురైనా నేను పట్టు విడవ లేదు. వట్టిపోయిన బోరుకు తిరిగి జలకళ తెప్పించినప్పుడు పత్రికలు తొలిసారి నా గురించి పొగుడుతూ రాశాయి. కానీ, నా భార్య మాత్రం ‘ఆయన వట్టి పనికిమాలిన వాడ’ని విలేకరులతో చెప్పింది. ఆ వార్త అచ్చయిన రోజునే అశోక ఫౌండేషన్ నాకు నెలకు రూ. 32 వేలతో మూడేళ్ల ఫెలోషిప్ ప్రకటించింది. అశోక తర్వాత దేశ్పాండే ఫౌండేషన్, ఆక్స్ఫామ్ ఇండియా తదితర సంస్థలు వెన్నుదన్నుగా నిలిచాయి. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూడలేదు. మొదట్లో పిచ్చివాడినన్న వారే ఫలితాలు చూసిన తర్వాత ‘జల గాంధీ’గా కీర్తిస్తున్నారు. మీ సంస్థల ద్వారా ఎన్ని రాష్ట్రాల్లో సేవలందిస్తున్నారు..? అయ్యప్ప మసగి : 2005 సెప్టెంబర్ 5న వాటర్ లిటరసీ ఫౌండేషన్ను నెలకొల్పా. 2008లో రెయిన్ వాటర్ కాన్సెప్ట్స్ ఇండి ప్రై. లి.ను ప్రారంభించా. నీటి సంరక్షణపై ఇప్పటి వరకు 5,368 సదస్సులు నిర్వహించా. చిన్న, సన్నకారు రైతులకు ఉచిత సలహాలు ఇస్తున్నాం. 10 వేల హెక్టార్ల పొలాల్లో వాన నీటి సంరక్షణ పనులు చేయించా. 300 అపార్ట్మెంట్లు, 31 గేటెడ్ కమ్యూనిటీలు, 171 పరిశ్రమలు, 168 పాఠశాలలకు సేవలందించాం. మా సంస్థల తరఫున 21 ప్రాజెక్టుల్లో 20 మంది సిబ్బంది, 100 మంది కార్మికులు పనిచేస్తున్నారు. ఇప్పుడు తెలంగాణ సహా 12 రాష్ట్రాల్లో సేవలందిస్తున్నాం. తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర నిర్వహించిన వి. ప్రకాశ్తో కలసి పనిచేస్తున్నాను. పొలాల్లో వాన నీటి సంరక్షణపై నమూనా క్షేత్రాలు ఎక్కడున్నాయి? అయ్యప్ప మసగి : అనంతపురం జిల్లా చిలమత్తూరు మండలం సుబ్బరావుపేట సమీపంలో మిత్రులతో కలసి 84 ఎకరాల్లో నమూనా సేంద్రియ క్షేత్రాన్ని నిర్మించాం. 37 వరుసల కందకాలు తవ్వి కట్టలు (కంపార్ట్మెంట్ బండింగ్) పోశాం. 3 చెరువులు తవ్వాం. 25 వేల (మీ. వెడల్పు, మీ. లోతున) చిన్న గోతులు తవ్వాం.. ఇవన్నీ చేయడానికి ఎకరానికి రూ.లక్షా 10 వేలు ఖర్చయింది. 300 మిల్లీ మీటర్ల వర్షపాతం ఉండే అనంతపురం జిల్లాలోనే రెండో ఏడాదికే మా పొలంలో నీటికి దిగుల్లేని పరిస్థితి వచ్చింది. చెరువుల్లో నీరుంది. బోర్లలో ఐదడుగుల్లో నీరుంది. 84 ఎకరాలకు ఒకే బోరు నీరందిస్తోంది. చిత్రావతి నదిలోనూ నీరు పారుతోంది. వరుసగా కొన్ని ఏళ్లు వాన పడకపోయినా మా పంటలకు నీటి దిగులుండదు. 60 శాతం స్థలంలో చెట్లు (ఎర్రచందనం, శ్రీగంధం, సిల్వర్ ఓక్స్, మలబారు వేప, నేరేడు, జామ వంటి చెట్లు), వరుసల మధ్య భూమిలో సీజనల్ ఆహార పంటలు సేంద్రియ పద్ధతుల్లో పండిస్తున్నాం. ఈ పద్ధతి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రైతులకు చాలా అనువైనది. మా స్వగ్రామం కర్ణాటకలోని టుమ్కూర్ జిల్లా హొలవనల్లి. అక్కడ మరో మూడున్నర ఎకరాల్లో నమూనా వ్యవసాయ క్షేత్రాన్ని నిర్మించాం. పొలంలో చేసిన పనులతోపాటు.. పొలం పక్కనే ఉన్న వాగులో ప్రత్యేక పద్ధతిలో ఇసుక అడుగున చెక్డామ్లు నిర్మించాం. ఆ ప్రాంతంలో బోర్లు, బావుల్లో జలకళ నిండింది. భూమిపైన చెక్డ్యామ్ల వల్ల కలిగే ప్రయోజనం కన్నా నదీ గర్భంలో ఇసుక అడుగున చెక్ డ్యామ్లు నిర్మించడం వల్ల వెయ్యి రెట్లు ఎక్కువ ప్రయోజనం ఉంటుందని మా అనుభవంలో తేలింది. ఇప్పటికి 200 మంది వాటర్ వారియర్స్(నీటి సేనానుల)కు శిక్షణ ఇచ్చాను. పట్టా బండింగ్, కందకాల ద్వారా తక్కువ ఖర్చుతోనే రైతులు నీటిని సంరక్షించుకోవచ్చు. ఈ పద్ధతులు వేగంగా వ్యాప్తి చెందాలంటే దాతలు, ప్రభుత్వం స్పందించాలి. - ఫొటోలు: ఎ. సతీష్, శ్రీధర్ (అయ్యప్ప మసగి కృషిపై ఇతర వివరాలకు www.waterliteracy.tk చూడవచ్చు) నీటి సంరక్షణపై ఉచిత సలహాలు.. యువతకు శిక్షణ.. జల గాంధీగా పేరుగాంచిన అయ్యప్ప మసగి రూపొందించిన పద్ధతుల్లో రైతులకు, గృహయజమానులకు ఉచితంగా ఫోన్ ద్వారా సమాచారం ఇస్తున్నాం. 91773 82777 నంబరులో సంప్రదించవచ్చు. కనీసం 8వ తరగతి పాసైన యువతకు జల సేనానులుగా 3 నెలల పాటు ఉచిత శిక్షణ ఇవ్వనున్నాం. భోజన, వసతి సదుపాయాలు ఎవరికి వారే చూసుకోవాలి. ఆసక్తిగల వారు ‘తెలంగాణ జల సంరక్షణ వేదిక (తేజస్వి), ఫ్లాట్ నం: 403, ఇంటి నం. 8-3-960, సిరి ఎన్క్లేవ్, శ్రీనగర్ కాలనీ, హైదరాబాద్ - 500073, తెలంగాణ’ అడ్రస్లో సంప్రదించవచ్చు. - వి. ప్రకాశ్ (90009 50400), చైర్మన్, తెలంగాణ జల సంరక్షణ వేదిక. savewater2021@gmail.com -
కరువులోనూ పర్యటించరా?: తమ్మినేని
తిప్పర్తి: తీవ్ర కరువు పరిస్థితుల్లో కూడా మంత్రులు, ఎమ్మెల్యేలు క్షేత్రస్థాయిలో పర్యటించకపోవడం దారుణమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ధ్వజమెత్తారు. సీపీఎం ఆధ్వర్యంలో చేపట్టిన కరువు పర్యటనలో భాగంగా సోమవారం నల్లల్లొండ జిల్లా తిప్పర్తి మండలం మాడ్గులపల్లి, ఇందుగుల గ్రామాలలో ఎండిన బత్తాయి తోటలను పరిశీలించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రెండు రాష్ట్రాల్లో ఇద్దరు చంద్రులు వారి కుటుంబాల మేలు కోసమే పరిపాలన చేస్తున్నారని ఎద్దేవా చేశారు. -
పాతాళానికి భూగర్భ జలాలు
సాక్షి, హైదరాబాద్: తీవ్ర వర్షాభావం, విచ్చలవిడిగా తోడేయడంతో రాష్ట్రంలో భూగర్భ జలాలు పాతాళానికి చేరుకున్నాయి. జనవరితో పోలిస్తే మార్చి నాటికి అంటే రెండు నెలల్లోనే ఏకంగా 1.13 మీటర్ల అదనపు లోతుల్లోకి వెళ్లిపోయాయి. జనవరిలో రాష్ట్రవ్యాప్తంగా సగటున 13.75 మీటర్ల లోతులో జలం లభించగా.. మార్చిలో అది 14.88 మీటర్లకు పడిపోయింది. అలాగే గత ఏడాది మార్చితో పోలిస్తే ఈ మార్చిలో 2.61 మీటర్ల అదనపు లోతులోకి భూగర్భ జలాలు అడుగంటాయని భూగర్భ జల శాఖ మంగళవారం విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. గతేడాది మార్చిలో 12.27 మీటర్ల లోతులో నీరు లభ్యం కాగా... ఈ మార్చిలో 14.88 మీటర్ల లోతులోకి అడుగంటాయి. గత ఏడాది మేతో పోల్చినా ఈ ఏడాది మార్చి నెలలోనే అధికంగా జలాలు పడిపోవడం పరిస్థితి తీవ్రతను వెల్లడిస్తోంది. వేసవికాలం ఇంకా నెలన్నరకు పైగా ఉండడంతో రాబోయే రోజుల్లో పరిస్థితి ఎంత తీవ్రంగా ఉంటుందోనని ఆందోళన వ్యక్తమవుతోంది. మెదక్, నిజామాబాద్ జిల్లాల్లో అధ్వానం రాష్ట్రంలో మెదక్, నిజామాబాద్ జిల్లాల్లో భూగర్భ జలాలు మరింతగా అడుగంటా యి. మెదక్ జిల్లాలో గతేడాది 18.39 మీటర్ల లోతులో జలాలు లభ్యం కాగా... ఈ ఏడాది మార్చిలో 24.34 మీటర్ల లోతు కు పడిపోయాయి. అంటే ఏకంగా 5.95 మీటర్లు లోపలికి వెళ్లిపోయాయి. ఇక నిజామాబాద్ జిల్లాలో గతేడాది మార్చిలో 14.29మీటర్ల లోతులో నీరుండగా... ఈ మార్చిలో 5.31 మీటర్లు అదనంగా 19.60 మీటర్ల లోతుకు వెళ్లిపోయాయి. దీంతో తాగునీటికి కూడా కటకట ఏర్పడింది.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
KKR vs MI: కేకేఆర్తో ముంబై కీలక పోరు.. తుది జట్లు ఇవే
జూనియర్ ఎన్టీఆర్ను అణగదొక్కాలని చూస్తున్నారు: కొడాలి నాని
లోక్సభ ఎలక్షన్స్ 2024: మూడో దశ పోలింగ్ జరిగేది ఇక్కడే..
రాహుల్గాంధీపై అస్సాం సీఎం సంచలన వ్యాఖ్యలు
ఒడిశా, పశ్చిమ బెంగాల్, బీహార్ రాష్ట్రాలకు చల్లని కబురు
అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)
షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు
సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి
ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?
తప్పక చదవండి
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
- రాయ్బరేలీ నుంచి తప్పుకున్న ప్రియాంక.. కారణం అదేనా?
- వేసవిలో ఉసిరి తినడం మంచిదేనా..?
- భయపడకు.. పారిపోకు: రాహుల్పై ప్రధాని మోదీ సెటైర్లు
Advertisement