ఇంటర్ విద్యార్థి అనుమానాస్పద మృతి | Sakshi
Sakshi News home page

ఇంటర్ విద్యార్థి అనుమానాస్పద మృతి

Published Fri, Apr 8 2016 6:07 PM

Suspicious death of Inter student in Guntur

ముప్పాళ్ల (గుంటూరు జిల్లా) : నల్లపాడులోని ప్రైవేటు కళాశాలలో ఎంసెట్ కోచింగ్ తీసుకుంటున్న సుదర్శన్ రెడ్డి(18) అనే విద్యార్థి అనుమానాస్పదస్థితిలో శుక్రవారం కళాశాల హాస్టల్ గదిలో మృతిచెందాడు. కాలేజీ యాజమాన్యం గుర్తించి పోలీసులకు, తల్లిదండ్రులకు విషయం తెలియజేశారు. సుదర్శన్ రెడ్డి స్వస్థలం గుంటూరు జిల్లా ముప్పాళ్ల. విషయం తెలిసిన తల్లిదండ్రులు కాలేజీ వద్దకు చేరుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
Advertisement