ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయం ఎదుట జీవోను రద్దు చేయాలని కోరుతూ గురువారం గ్రూప్స్ అభ్యర్థులు ధర్నా నిర్వహించారు.
ఎపీపీఎస్సీ కార్యాలయం ఎదుట ఆందోళన
Aug 11 2016 4:48 PM | Updated on Nov 9 2018 4:46 PM
హైదరాబాద్: జీవో 150ని వెంటనే రద్దు చేయాలని, గ్రూప్స్ పరీక్షలు పాత పద్దతి ప్రకారమే నిర్వహించాలని డిమాండ్ చేస్తూ.. గ్రూప్ పరీక్షలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులు ఆందోళనకు దిగారు. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయం ఎదుట గురువారం గ్రూప్స్ అభ్యర్థులు జీవోను రద్దు చేయాలని కోరుతూ ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో పాల్గొనడానికి పలు జిల్లాల నుంచి పెద్ద ఎత్తున అభ్యర్థులు తరలివచ్చారు. ఏపీపీఎస్సీ కార్యాలయం ప్రధాన గేటు ఎదుట నిరసనకు దిగిన అభ్యర్థులు ఒక దశలో కార్యాలయం లోపలికి చొచ్చుకు వెళ్లడానికి యత్నించడంతో.. పోలీసులు వారిని అరెస్ట్ చేశారు.
Advertisement


