కార్పొరేషన్లలో స్పెషల్‌ ఆఫీసర్ల పాలన పొడిగింపు | Special officers rule extended in five corporations | Sakshi
Sakshi News home page

కార్పొరేషన్లలో స్పెషల్‌ ఆఫీసర్ల పాలన పొడిగింపు

Feb 17 2016 8:07 PM | Updated on Sep 3 2017 5:50 PM

ఐదు కార్పొరేషన్లలో స్పెషల్‌ ఆఫీసర్ల పాలన పొడిగిస్తూ బుధవారం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

విజయవాడ:  ఐదు కార్పొరేషన్లలో స్పెషల్‌ ఆఫీసర్ల పాలన పొడిగింపునకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఈ మేరకు బుధవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తిరుపతి, కాకినాడ, గుంటూరు, కర్నూలు, ఒంగోలులో కార్పొరేషన్లలో ప్రత్యేకాధికారుల పాలనను పొడిగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

వీటితో పాటుగా ప్రకాశం జిల్లా కందకూరు, కడప జిల్లాలోని రాజంపేట నగర పంచాయతీలో ప్రత్యేకాధికారుల పాలనను ప్రభుత్వం పొడిగించింది.

Advertisement
 
Advertisement
Advertisement