బ్లాక్‌మనీ తరలిస్తున్న ముగ్గురు అరెస్ట్ | shifting block money three arresred in kurnool | Sakshi
Sakshi News home page

బ్లాక్‌మనీ తరలిస్తున్న ముగ్గురు అరెస్ట్

Sep 20 2015 5:50 PM | Updated on Apr 3 2019 4:10 PM

బ్లాక్‌మనీ తరలిస్తున్న ముగ్గుర్ని కర్నూలు జిల్లా బనగానపల్లె పోలీసులు అరెస్ట్ చేశారు.

కర్నూలు: బ్లాక్‌మనీ తరలిస్తున్న ముగ్గుర్ని కర్నూలు జిల్లా బనగానపల్లె పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి సుమారు రూ.20 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. కారులో వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు నుంచి కర్నూలుకు తరలిస్తుండగా బనగానపల్లె వద్ద వీరిని పట్టుకున్నట్లు సమాచారం. పట్టుబడిన సయ్యద్ అహ్మద్, షఫీక్ అహ్మద్, ఫిరోజ్ బాషాలు కర్నూలు పట్టణానికి చెందిన వారిగా గుర్తించారు. నిందితులను ఇన్‌కమ్‌టాక్స్ అధికారులకు అప్పగించినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
 

Advertisement
 
Advertisement
Advertisement