అనంతపురంలో అర్ధరాత్రి స్కార్పియో దగ్ధం | Scorpio catches fire in Anatapur district | Sakshi
Sakshi News home page

అనంతపురంలో అర్ధరాత్రి స్కార్పియో దగ్ధం

Dec 30 2015 8:04 AM | Updated on Sep 3 2017 2:49 PM

అనంతపురం జిల్లాలోని గుత్తి మండలంలో అర్ధరాత్రి సమయంలో ఇంటి ముందున్న స్కార్పియోకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు.

గుత్తి: అనంతపురం జిల్లాలోని గుత్తి మండలంలో అర్ధరాత్రి సమయంలో ఇంటి ముందున్న స్కార్పియోకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. ఈ ఘటనలో వాహనం పూర్తిగా దగ్ధం అయింది. అనంతపురం జిల్లా గుత్తి మండలం ఎంపీపీ వీరేష్ బసినేపల్లిలో నివాసం ఉంటారు.

మంగళవారం రాత్రి ఇంటి ముందు స్కార్పియోను పార్క్ చేశారు. అర్ధరాత్రి 1.30 గంటల వరకు మేల్కొనే ఉన్నారు. తెల్లారి చూసేసరికి వాహనం పూర్తిగా దగ్ధమై కనిపించింది. దీనిపై ఆయన పోలీసులకు సమాచారం అందించారు.

Advertisement
 
Advertisement
Advertisement