ఇసుక తరలిస్తున్న ఏడు ట్రాక్టర్లు, జేసీబీ సీజ్‌ | sand tranported 7 tractors, jcb sieze | Sakshi
Sakshi News home page

ఇసుక తరలిస్తున్న ఏడు ట్రాక్టర్లు, జేసీబీ సీజ్‌

Nov 9 2016 11:14 PM | Updated on Sep 4 2017 7:39 PM

ఆచంట : అయోధ్యలంక పంచాయతీ పరిధి పుచ్చలంకలో బుధవారం రాత్రి బొండు ఇసుకను అక్రమంగా తరలిస్తున్న ఏడు ట్రాక్టర్లతోపాటు, జేసీబీని ఆచంట పోలీసులు సీజ్‌ చేశారు.

ఆచంట : అయోధ్యలంక పంచాయతీ పరిధి పుచ్చలంకలో బుధవారం రాత్రి బొండు ఇసుకను అక్రమంగా తరలిస్తున్న ఏడు ట్రాక్టర్లతోపాటు, జేసీబీని ఆచంట పోలీసులు సీజ్‌ చేశారు. ఈ గ్రామం తూర్పుగోదావరి జిల్లాను ఆనుకుని ఉండడంతో రాత్రి వేళల్లో అక్రమార్కులు ట్రాక్టరర్లపై అక్రమంగా ఇసుక తరలిస్తున్నారు.  వీఆర్‌వో అప్పారావు  ఫిర్యాదు మేరు ఆచంట ఎస్‌ఐ ఏజీఎస్‌ మూర్తి సిబ్బందితో దాడిచేశారు.అక్రమార్కులకు పోలీసులకు మధ్య వాగ్వివాదం జరిగింది. దీంతో ఎస్‌ఐ పాలకొల్లు  సీఐ చంద్రశేఖర్‌కు సమాచారం ఇచ్చారు. సీఐ అదనపు పోలీసులతో గ్రామానికి చేరుకున్నారు. దీంతో అక్రమార్కులు పరారయ్యారు. దీంతో పోలీసులు ఏడు ట్రాక్టర్లు, జేసీబీని సీజ్‌ చేసిఇ.వెంకటేశ్వరరావుతోపాటు తొమ్మిది మందిపై కేసులు నమోదు చేశారు. 
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement