విశ్రాంత ఉద్యోగులకు గ్రీవెన్స్‌సెల్‌ | retired eimployees greavence cell | Sakshi
Sakshi News home page

విశ్రాంత ఉద్యోగులకు గ్రీవెన్స్‌సెల్‌

Jul 19 2016 11:09 AM | Updated on Sep 2 2018 4:52 PM

మాట్లాడుతున్న వీరభద్రస్వామి - Sakshi

మాట్లాడుతున్న వీరభద్రస్వామి

ప్రతీ సోమవారం విశ్రాంత ఉద్యోగుల గ్రీవెన్స్‌ సెల్‌ నిర్వహించనున్నట్టు ఏపీ ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల ఎంప్లాయిస్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు టి.వీరభద్రస్వామి తెలిపారు.

శ్రీకాకుళం అర్బన్‌: ప్రతీ సోమవారం విశ్రాంత ఉద్యోగుల గ్రీవెన్స్‌ సెల్‌ నిర్వహించనున్నట్టు ఏపీ ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల ఎంప్లాయిస్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు టి.వీరభద్రస్వామి తెలిపారు. ఏపీ ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల ఎంప్లాయిస్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో శ్రీకాకుళంలోని ఎన్‌జీవో కార్యాలయంలో సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమం శ్రీకాకుళంలోని ఎన్‌జీవో కార్యాలయంలో ప్రతీ సోమవారం ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకూ నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగులు ఎవరికైనా సమస్య వస్తే ఆ సమస్యను అసోసియేషన్‌ దృష్టికి తీసుకువస్తే సంబంధిత శాఖ వద్దకు వెళ్లి వాటి పరిష్కారానికి కృషిచేస్తామని తెలిపారు. దీనిని జిల్లాలోని పెన్షనర్లందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో  ఏపీ ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల ఎంప్లాయిస్‌ అసోసియేషన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి పి.నర్సింహులు, కోశాధికారి బి.జయలక్ష్మి, సంఘ జేఏసీ సభ్యుడు డీపీ దేవ్, సంఘ సభ్యులు ఆర్‌.మోహనరావు, ఎస్‌.పి.సన్యాసిలింగం, బి.రామకృష్ణ, సవరయ్య, సూర్యారావు, మోహనరావు, తదితరులు పాల్గొన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement