వర్గీకరణ కాదు.. రిజర్వేషన్‌ శాతాన్ని పెంచండి | reservation extra persentage plz | Sakshi
Sakshi News home page

వర్గీకరణ కాదు.. రిజర్వేషన్‌ శాతాన్ని పెంచండి

Dec 4 2016 11:11 PM | Updated on Sep 4 2017 9:54 PM

వర్గీకరణతో దళితుల మధ్య విభజన కాదు.. రిజర్వేషన్ల శాతాన్ని 15 నుంచి 23 శాతానికి పెంచాలని మాల మహానాడు రాష్ట్ర పొలిట్‌ బ్యూరో కన్వీనర్‌ ఎంఏకే భీమారావు అన్నారు. స్థానిక ఎన్టీఆర్‌ మార్‌్గలో ఆదివారం జరిగిన కోనసీమ మాల మహానాడు ముఖ్య

  • మాలమహానాడు రాష్ట్ర పొలిట్‌ బ్యూరో కన్వీనర్‌ భీమారావు
  • అమలాపురం టౌన్‌ : 
    వర్గీకరణతో దళితుల మధ్య విభజన కాదు.. రిజర్వేషన్ల శాతాన్ని 15 నుంచి 23 శాతానికి పెంచాలని మాల మహానాడు రాష్ట్ర పొలిట్‌ బ్యూరో కన్వీనర్‌ ఎంఏకే భీమారావు అన్నారు. స్థానిక ఎన్టీఆర్‌ మార్‌్గలో ఆదివారం జరిగిన కోనసీమ మాల మహానాడు ముఖ్య నాయకుల సమావేశానికి భీమారావు ముఖ్య అతిథిగా హాజరై  ప్రసంగించారు. రాష్ట్ర కార్యదర్శి పినిపే రాధాకృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశం ఇటీవల కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు వర్గీకరణకు అనుకూలంగా మాట్లాడి మాలమాదిగల మధ్య మరోసారి చిచ్చుపెట్టేందుకు ప్రయత్నించిన తీరుపై చర్చించింది. 2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలో ఎస్సీల జనాభా 23 శాతం ఉన్నందున రిజర్వేష¯ŒS శాతాన్ని విధిగా పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందని భీమారావు అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ రంగం కనుమరుగవుతున్న క్రమంలో ప్రైవేట్‌ రంగంలో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించాలని... ఆ దిశగా ఎమ్మార్పీఎస్‌ నేత మంద కృష్ణ మాదిగ ఆలోచించాలని సూచించారు. వర్గీకరణను అడ్డుకునేందుకు మాల మహానాడు ఉద్యమాన్ని మరోసారి ఉధృతం చేయనుందని, త్వరలోనే కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, దత్తాత్రేయ ఇళ్లను ముట్టడిస్తామని భీమారావు స్పష్టం చేశారు. దళిత నాయకులు దేవరపల్లి శాంతికుమార్, అయితాబత్తుల సుభాషిణి, పులపకూర ఏడుకొండలు, జగడం సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement