పోలీస్ ఎస్కార్ట్ నుంచి రిమాండ్ ఖైదీ పరార్ | Remand inmate absconding in rajahmundry | Sakshi
Sakshi News home page

పోలీస్ ఎస్కార్ట్ నుంచి రిమాండ్ ఖైదీ పరార్

May 11 2016 9:02 AM | Updated on Sep 15 2018 8:03 PM

పోలీసు ఎస్కార్ట్ నుంచి శ్రీనివాసులు అనే రిమాండ్ ఖైదీ తప్పించుకుని పరారయ్యాడు.

రాజమండ్రి : పోలీసు ఎస్కార్ట్ నుంచి శ్రీనివాసులు అనే రిమాండ్ ఖైదీ తప్పించుకుని పరారయ్యాడు. ఈ సంఘటన రాజమండ్రిలో షెల్టన్ హోటల్ సమీపంలో మంగళవారం అర్థరాత్రి చోటుచేసుకుంది. ఓ కేసు విషయమై శ్రీనివాసులును రాజమండ్రి నుంచి కడప జిల్లా కోర్టుకు తరలించారు.

కోర్టులో హజరుపరిచి తిరిగి రాజమండ్రి తీసుకువస్తుండగా ఈ సంఘటన చోటు చేసుకుంది. మూత్ర విసర్జనకు వెళ్లి వస్తానని చెప్పిన శ్రీనివాసులు... పోలీసులు ఏమరుపాటుగా ఉన్న సమయంలో పలాయనం చిత్తగించాడు. తప్పించుకున్న ఖైదీ శ్రీనివాసులు కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement