‘సీమ’కే తలమానికం రత్నగిరి క్షేత్రం
రొళ్ల (మడకశిర) : చెక్కుచెదరని కోటలు, కొండపై ఎత్తైన బురుజు, గజశాలలు, రాతి ఏనుగులు, కల్యాణిబావులు, మంటపాలు, పురాతన కట్టడాలతో రత్నగిరి క్షేత్రం రాయలసీమకే తలమానికంగా నిలుస్తోంది. రత్నగిరికి 1900 ఏళ్ల నాటి చరిత్ర ఉంది. రత్నగిరి సంస్థానాన్ని మొదట రాజుగ తిమ్మప్పనాయక పాలించారు. అతని తాత మాదప్పనాయక ఆనేగొందిని పాలించారు.ఆయనకు నలుగురు సంతానం మొదటి రాజు అయిన కెంపు లక్ష్మణనాయక, లక్ష్మణనాయక, మంద నాగనాయక, రత్రాంబిక అనే వారు ఉండేవారని చరిత్ర చెబుతోంది. క్రీ.శ.1799లో ఇక్కడికి వచ్చిన కర్ణాటక ప్రాంత మైసూరు శ్రీరంగపట్టణం టిప్పుసుల్తాన్రాజు రత్నగిరికి ‘ముస్తాఫాబాద్’ అని నామకరణం కూడా చేశారు.
అలనాటి రాజుల పాలనకు గుర్తుగా ఎన్నో దేవాలయాలు, భవనాలు, కోట ముఖద్వారాలు, ఇరు పక్కల రాతి ఏనుగులు, కల్యాణి బావులు నిర్మించారు. రాజులు నిర్మించిన శత్రుదుర్బేధ్యమైన కోటలు, రాణులు స్నానం ఆచరించడానికి ప్రత్యేకంగా నిర్మించిన ఈత కొలనులు, కొండ పైకి ఎక్కేందుకు బండపై చెక్కిన మెటికెలు, ఇక్కడ శత్రువుల రాకను పసిగట్టి రాజును, సైనికులను అప్రమత్తం చేసేందుకు ఏర్పాటు చేసిన స్థలం, రాణి నివసించేందుకు ఏర్పాటు చేసిన విశాలమైన భవంతి, శత్రువులు ప్రవేశించడానికి వీలుకాకుండా కొండపైన చుట్టూ 35 అడుగుల ఎత్తులో ప్రహరీ నిర్మించారు. రత్నగిరి కొండను చేరుకునేందుకు చుట్టూ ఏడు కోటలు ఉన్నాయి. గ్రామంలో అక్కడక్కడ కనిపించే జైన దేవాలయాను బట్టి చూస్తే రత్నగిరి ప్రాంతాల్లో జైనమతం విలసిల్లినట్లు తెలుస్తోంది. రాజవంశస్తులు పూజించే కులదేవత శ్రీకొల్లాపురిమహాలక్ష్మిదేవి బ్రహ్మోత్సవాలు ప్రతి ఏడాదీ చైత్రమాసంలో అత్యంత వైభవంగా ఉత్సవాలు జరపడం ఆనవాయితీ. ఆలయ సమీపంలో గల పాలబావిలో గంగ పూజ చేస్తే సంతానం లేనివారికి సంతానభాగ్యం, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి వ్యాధులు నయం అవుతాయని భక్తుల నమ్మకం.
ఇలా చేరుకోవచ్చు..
రొళ్ల మండల కేంద్రం నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో గల కర్ణాటక ప్రాంతం మధుగిరి పట్టణానికి వెళ్లే మార్గంలో ఈ క్షేత్రం ఉంది. జిల్లా కేంద్రం అనంతపురం నుంచి అయితే 139 కిలోమీటర్ల దూరం ఉంది. పెనుకొండ వయా మడకశిర నుంచి రొళ్ల మీదుగా రత్నగిరి చేరుకోవచ్చు.
చూసొద్దాం రండి
Published Sun, May 7 2017 12:16 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
ఎంఎస్ ధోని అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా
కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
సమంత షాకింగ్ పోస్ట్.. పెట్టి డిలీట్ చేసిందా?
రాహుల్ తెలంగాణ మహిళలకు క్షమాపణలు చెప్పాలి: హరీశ్రావు
కేకేఆర్తో లక్నో పోరు.. తుది జట్లు ఇవే! స్టార్ బౌలర్ దూరం
జడేజా ఆల్రౌండ్ షో.. పంజాబ్ను చిత్తు చేసిన సీఎస్కే
సీను సీతారైంది సాంబడా
తప్పక చదవండి
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
Advertisement