విదర్భ నుంచి కర్ణాటక, తెలంగాణ, రాయలసీమ మీదుగా తమిళనాడు వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతుందని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం వెల్లడించింది.
విశాఖపట్నం : విదర్భ నుంచి కర్ణాటక, తెలంగాణ, రాయలసీమ మీదుగా తమిళనాడు వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతుందని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ నేపథ్యంలో తెలంగాణ, రాయలసీమల్లో ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. కోస్తాంధ్రలో అయితే అక్కడక్కడ ఉరుములతో కూడిన వర్షాలు పడతాయని పేర్కొందని .కోస్తాంధ్రలో ఈ రోజు కూడా సాధారణం కంటే 1 లేదా 2 డిగ్రీల ఉష్ణోగ్రతలు అదనంగా నమోదయ్యే అవకాశం ఉందని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం చెప్పింది.