రాగల 48 గంటల్లో తెలంగాణలో పలుచోట్ల వర్షాలు! | rains in telangana with in 48 hours, says visakhapatnam meteorological department | Sakshi
Sakshi News home page

రాగల 48 గంటల్లో తెలంగాణలో పలుచోట్ల వర్షాలు!

Jul 20 2016 9:50 AM | Updated on Sep 4 2017 5:29 AM

ఒడిశా నుంచి దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి ఉందని విశాఖపట్నం వాతావరణ కేంద్రం తెలిపింది.

విశాఖపట్నం : ఒడిశా నుంచి దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి ఆవరించి ఉందని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం బుధవారం వెల్లడించింది. ఇది కోస్తాంధ్ర మీదుగా కొనసాగుతుందని తెలిపింది. రాయలసీమ పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని పేర్కొంది.

ఈ నేపథ్యంలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని చెప్పింది. కోస్తాంధ్ర, రాయలసీమలో అక్కడక్కడా మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని తెలిపింది. రాగల 48 గంటల్లో తెలంగాణలో పలుచోట్ల వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement