రాగల 24 గంటల్లో అక్కడక్కడా వర్షాలు | Rains in Seemandhra districts, says visakhapatnam meteorological department | Sakshi
Sakshi News home page

రాగల 24 గంటల్లో అక్కడక్కడా వర్షాలు

Oct 31 2015 9:58 AM | Updated on Sep 3 2017 11:47 AM

ఆంధ్రప్రదేశ్లో ఈశాన్య రుతుపవనాల ప్రభావం బలంగా ఉన్నాయని విశాఖపట్నంలోని వాతావరణ శాఖ అధికారులు శనివారం వెల్లడించారు.

విశాఖపట్నం : ఆంధ్రప్రదేశ్లో ఈశాన్య రుతుపవనాల ప్రభావం బలంగా ఉన్నాయని విశాఖపట్నంలోని వాతావరణ శాఖ అధికారులు శనివారం వెల్లడించారు. రుతుపవనాల ప్రభావంతో కోస్తా, రాయలసీమల్లో రాగల 24 గంటల్లో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని తెలిపారు. అలాగే కోస్తా తీరం వెంబడి 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని చెప్పారు. అయితే శ్రీలంక పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement