సంతజూటూరు పికప్ ఆనకట్ట వద్ద నీటి మునిగి ఓ వ్యక్తి మృతి చెందారు.
గాలేరులో మునిగి వ్యక్తి మృతి
Dec 20 2016 11:57 PM | Updated on Sep 28 2018 3:41 PM
బండిఆత్మకూరు: సంతజూటూరు పికప్ ఆనకట్ట వద్ద ఽనీటి మునిగి ఓ వ్యక్తి మృతి చెందారు. మృతుడు నంద్యాల పట్టణంలోని దేవనగర్ ప్రాంతానికి చెందిన మల్లికార్జున (33)గా పోలీసులు గుర్తించారు. మల్లికార్జునతో పాటు, అతని స్నేహితులు దాసు, వర్మ విందు చేసుకునేందుకు మంగళవారం ఆనకట్ట వద్దకు చేరుకున్నారు. విందు అనంతరం సరదాగా ఈత కొట్టేందుకు మల్లికార్జున గాలేరు నదిలోకి దిగి నీటి ప్రవాహంలో చిక్కుకు పోయాడు. దీంతో స్నేహితుడిని రక్షించేందుకు దాసు కూడా నీటి ప్రవాహంలోకి దూకాడు. ఈ క్రమంలో దాసు కూడా నీటి ప్రవాహంలో గల్లంతయ్యాడు. విషయం తెలుసుకున్న స్థానిక మత్స్య కారులు వచ్చి దాసును ఒడ్డుకు చేర్చారు. మల్లికార్జున కోసం గాలించినప్పటికీ ఫలితం లేదు. కొద్ది దూరంలోనే అడుగు భాగంలో ఉన్న గుంతలో మృతదేహం లభించింది. మృతుడికి భార్యతో పాటు ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. ఎస్ఐ విష్ణు నారాయణ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Advertisement