రాజన్న సన్నిధిలో నవరాత్రోత్సవాలు ప్రారంభం | Navratrulu at Vemulawada | Sakshi
Sakshi News home page

రాజన్న సన్నిధిలో నవరాత్రోత్సవాలు ప్రారంభం

Apr 8 2016 7:58 PM | Updated on Nov 6 2018 5:52 PM

కరీంనగర్ జిల్లా వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి క్షేత్రంలో ఈ నెల 15న శ్రీరామనవమిని పురస్కరించుకుని శుక్రవారం నుంచి వసంత నవరాత్రోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి.

వేములవాడ : కరీంనగర్ జిల్లా వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి క్షేత్రంలో ఈ నెల 15న శ్రీరామనవమిని పురస్కరించుకుని శుక్రవారం నుంచి వసంత నవరాత్రోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉదయం స్వామివారికి సుప్రభాతం, ప్రాతఃకాల పూజ అనంతరం మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు. అనంతరం సీతారామచంద్రస్వామి వార్లకు పుణ్యహావచనం, రుత్విక్‌హరణం, పంచోపనిషత్, మహాభిషేకం నిర్వహించారు. 
 
నవరాత్రోత్సవాల్లో భాగంగా ఈ నెల 13 నుంచి త్రిరాత్రోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 15న ఘనంగా సీతారాముల కల్యాణోత్సవం నిర్వహించనున్నారు. అదే రోజు సాయంత్రం 4.30 గంటలకు స్వామివారి ఉత్సవమూర్తుల రథోత్సవం ఉంటుంది. రాజన్న సన్నిధిలో జరిగే రాములోరి పెళ్లికి వేలాది మంది శివపార్వతులు తరలివచ్చి రాజన్నను కల్యాణమాడటం ఇక్కడి విశేషం. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement