ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో ఈ నెల 15న ‘భాషా నైపుణ్యాలు, ఉద్యోగ అవకాశాలు’ అంశంపై తెలుగు, ఇంగ్లిష్, సంస్కృత భాషల్లో జాతీయ సెమినార్ నిర్వహించనున్నట్టు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రాపాక డేవిడ్ కుమార్స్వామి మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
15న ఆర్ట్స్ కళాశాలలో జాతీయ సెమినార్
Dec 13 2016 11:57 PM | Updated on Sep 4 2017 10:38 PM
కంబాలచెరువు :
ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో ఈ నెల 15న ‘భాషా నైపుణ్యాలు, ఉద్యోగ అవకాశాలు’ అంశంపై తెలుగు, ఇంగ్లిష్, సంస్కృత భాషల్లో జాతీయ సెమినార్ నిర్వహించనున్నట్టు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రాపాక డేవిడ్ కుమార్స్వామి మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బోధనలో వినూత్న విధానాలు, భాషలో ప్రత్యేక నైపుణ్యాలకు పెరుగుతున్న రంగాలు, సిలబస్లో మార్పు ద్వారా పెరిగే ఉద్యోగ అవకాశాలు, కమ్యూనికేష¯ŒS స్కిల్స్, సాహిత్యం ద్వారా వ్యక్తిత్వ వికాసం, భాషాసాహిత్యం ద్వారా ఉపాధి అవకాశాలపై సెమినార్లో చర్చిస్తారని తెలిపారు. దీనికి సంబంధించిన అంశాలను అనుఫాంట్ సెవె¯ŒSలో సెమినార్ పత్రాల రూపంలో ఆర్వీ.కామేశ్వరరావుఎట్దిరేటాఫ్జీమెయిల్.కామ్కు పంపాలని సూచిం చారు. లేనిపక్షంలో సెమినార్ జరిగే రోజు ఉదయం 9 గంటలకు హాజరై రిజిస్ట్రేష¯ŒS చేసుకోవచ్చని తెలిపారు.
Advertisement
Advertisement