నన్నయ వీసీకి విద్యాభూషణ్‌ అవార్డు ప్రదానం

నన్నయ వీసీకి విద్యాభూషణ్‌ అవార్డు ప్రదానం

రాజరాజనరేంద్రనగర్‌ (రాజాన గరం):  ప్రపంచ ఉపాధ్యాయదినోత్సవం సందర్భంగా ‘మేజిక్‌ ఫర్‌ సోషల్‌ సర్వీస్‌’ స్వచ్ఛంద సంస్థ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సేవలందించిన విశిష్ట వ్యక్తులకు ఏటా ఇస్తున్న విద్యాభూషణ్‌ అవార్డును ఈ ఏడాది నన్నయ వర్సిటీ వీసీ ఆచార్య ముత్యాలు నాయుడికి అందజేసింరు. ఈ సందర్భంగా ఆయనను బుధవారం యూనివర్సిటీలో ఆ సంస్థ సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ అవార్డును సంస్థ వ్యవస్థాపకుడు డాక్టర్‌ చింతా శ్యామ్, జ్యూరీ సభ్యులు ఆయనకు అందజేశారు.   వీసీ ముత్యాలునాయుడు కృతజ్ఞతలు తెలిపారు. రిజిస్ట్రార్‌ ఆచార్య ఎ. నరసింహారావు, అధ్యాపకులు డాక్టర్‌ టి. సత్యనారాయణ, డాక్టర్‌ ఎస్‌. టేకి తదతరులు పాల్గొన్నారు. 

 
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top