రాజోలిలో దారుణహత్య | murder in rajoli | Sakshi
Sakshi News home page

రాజోలిలో దారుణహత్య

Jul 22 2016 12:24 AM | Updated on Jul 30 2018 8:29 PM

రాజోలిలో దారుణహత్య - Sakshi

రాజోలిలో దారుణహత్య

వడ్డేపల్లి మండలం రాజోలిలో ఓ యువకుడు దారుణహత్యకు గురైన సంఘటన గురువారం రాత్రి చోటు చేసుకుంది. అందరూ చూస్తుండగానే మటన్‌ వ్యాపారి అమీర్‌ (30)ను ఓ గుర్తు తెలియని వ్యక్తి కత్తితో నరికి పారిపోయాడు.

శాంతినగర్‌: వడ్డేపల్లి మండలం రాజోలిలో ఓ యువకుడు దారుణహత్యకు గురైన సంఘటన గురువారం రాత్రి చోటు చేసుకుంది. అందరూ చూస్తుండగానే మటన్‌ వ్యాపారి అమీర్‌ (30)ను ఓ గుర్తు తెలియని వ్యక్తి కత్తితో నరికి పారిపోయాడు. స్థానికుల కథనం ప్రకారం.. రాజోలికి చెందిన కటిక అమీర్‌ (30)మటన్‌ వ్యాపారం చేసేవాడు. ఏడాది క్రితం అమీర్‌కు వివాహమైంది. 2008లో జరిగిన ఇనుప సామాన్ల వ్యాపారి బాబుమియా హత్యకేసులో ప్రధాన నిందితుడు. అలాగే మరో కేసులోనూ నిందితుడిగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

మూడు రోజులుగా గ్రామానికి చెందిన కొందరితో పేకాటకు సంబంధించిన డబ్బుల వ్యవహారంలో అమీర్‌ గొడవపడుతున్నాడని సమాచారం. ఈక్రమంలో గురువారం రాత్రి అతడు తన మటన్‌షాపు సమీపంలో నిలబడి ఉండగా, ఓ వ్యక్తి కత్తితో దాడి చేసి అమీర్‌ తల నరకడంతో పాటు ఎడమ చేయి మణికట్టు వరకు కోసి, పరారయ్యాడు. హఠాత్తుగా జరిగిన సంఘటనతో మటన్‌ మార్కెట్‌ పరిసరాల్లో ఉన్న జనం భయపడ్డారు. విషయం తెలుసుకున్న మృతుడి తల్లి, భార్య సంఘటన స్థలానికి చేరుకుని అమీర్‌ మృతదేహంపై పడి బోరున విలపించారు. సంఘటన స్థలాన్ని శాంతినగర్‌ ఎస్‌ఐ వెంకటేశ్వర్లు పరిశీలించి పంచనామా నిర్వహించారు. గతంలో జరిగిన హత్యల నేపథ్యంలో హత్య చేశారా లేక పేకాట గొడవల వల్ల హత్యకు గురయ్యాడా అనే విషయంపై పోలీసులు సమాచారం సేకరిస్తున్నారు. అమీర్‌ను హత్య చేసిన నిందితుడు నేరుగా వెళ్లి రాజోలి పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయినట్లు సమాచారం. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement