హత్యకేసులో భార్యాభర్తల అరెస్ట్‌ | murder case.. couple arrest | Sakshi
Sakshi News home page

హత్యకేసులో భార్యాభర్తల అరెస్ట్‌

Mar 21 2017 2:14 AM | Updated on Aug 20 2018 4:30 PM

దేవరపల్లి మండలం కురుకూరులో ఈనెల 18 రాత్రి జరిగిన హత్యకు సంబంధించి నిందితులైన భార్యాభర్తలను

దేవరపల్లి: దేవరపల్లి మండలం కురుకూరులో ఈనెల 18 రాత్రి జరిగిన హత్యకు సంబంధించి నిందితులైన భార్యాభర్తలను పోలీసులు అరెస్ట్‌ చేశారు. దేవరపల్లి పోలీస్‌స్టేషన్‌లో సీఐ ఎం.సుబ్బారావు వివరాలను విలేకరులకు వెల్లడించారు. కురుకూరుకు చెందిన పెంటపాటి శ్రీను (56), వెంగళ సత్యనారాయణ (సత్తియ్య) కుటుంబాల మధ్య ఇంటి సరిహద్దు తగాదా ఉంది. ఈ నేపథ్యంలో ఈనెల 18న రాత్రి రెండు కుటుంబాల మధ్య వివాదం జరిగింది. సత్యనారాయణ కత్తితో దాడిచేసి మెడ భాగంలో నరకడంతో శ్రీను అక్కడకక్కడే మృతి చెందాడు. ఇందుకు సత్యనారాయణ భార్య భవాని ప్రోత్సహించింది. ఈ కేసులో నిందితులైన సత్యనారాయణ, భవానీను సోమవారం పల్లంట్ల వంతెన వద్ద అరెస్ట్‌ చేసినట్టు సీఐ సుబ్బారావు చెప్పారు. సత్యనారాయణ నుంచి కత్తి స్వాధీనం చేసుకుని సీజ్‌ చేశామన్నారు. నిందితులను మంగళవారం కొవ్వూరు కోర్టులో హాజరుపరుస్తామని చెప్పారు. సత్యనారాయణకు నేర స్వభావం ఉన్నట్టు తన దర్యాప్తులో తేలిందని అతనిపై రౌడీషీట్‌ తెరువనున్నట్టు సీఐ చెప్పారు. ఎస్సై పి.వాసు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement