ప్రశ్నిస్తే చిందులా ! | mlc x mla | Sakshi
Sakshi News home page

ప్రశ్నిస్తే చిందులా !

Oct 21 2016 12:17 AM | Updated on Sep 4 2017 5:48 PM

ప్రశ్నిస్తే చిందులా !

ప్రశ్నిస్తే చిందులా !

అడిగే ప్రశ్నకు సమాధానం లేకపోతే ఆవేశం .. అరుపులు .. గందరగోళం సృష్టించి తమదే పైచేయంటూ భుజాలెగరేయడం ... ఇదీ నేటి టీడీపీ నేతల తీరు. గురువారం రాత్రి జిల్లా కలెక్టర్‌ హెచ్‌. అరుణ్‌ కుమార్‌ అధ్యక్షతన జరిగిన నీటి పారుదల సలహా సంఘ సమావేశంలో వారు అదే బాటను అనుసరించారు. వేదికపైనున్న మంత్రులనుద్దేశించి ఎమ్మెల్సీ సుభాస్‌ చంద్రబోస్‌ అడిగిన ఓ ప్రశ్నకు ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు అడ్డుపడుతూ చెలరేగిపోయారు. సహచర ఎమ్మ

అడిగే ప్రశ్నకు సమాధానం లేకపోతే ఆవేశం .. అరుపులు .. గందరగోళం సృష్టించి తమదే పైచేయంటూ భుజాలెగరేయడం ... ఇదీ నేటి టీడీపీ నేతల తీరు. గురువారం రాత్రి జిల్లా కలెక్టర్‌ హెచ్‌. అరుణ్‌ కుమార్‌ అధ్యక్షతన జరిగిన నీటి పారుదల సలహా సంఘ సమావేశంలో వారు అదే బాటను అనుసరించారు. వేదికపైనున్న మంత్రులనుద్దేశించి ఎమ్మెల్సీ సుభాస్‌ చంద్రబోస్‌ అడిగిన ఓ ప్రశ్నకు ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు అడ్డుపడుతూ చెలరేగిపోయారు. సహచర ఎమ్మెల్యేలు వారించినా ... మంత్రులు సర్ధిచెబుతున్నా వినకుండా గాలిలో చేతులూపుతూ అసభ్య పదజాలంతో  తన అసహనాన్ని వెళ్లగక్కారు.
 

Advertisement
 
Advertisement
Advertisement