గూడ్సు రైల్లో మృత శిశువు | Sakshi
Sakshi News home page

గూడ్సు రైల్లో మృత శిశువు

Published Tue, Aug 2 2016 11:59 PM

MKid deadbody in train

ముత్తుకూరు : ఒంగోలు నుంచి కష్ణపట్నం పోర్టుకు గ్రానైట్‌రాళ్ల లోడుతో మంగళవారం వచ్చిన గూడ్సు రైలులో ఒక మత శిశువు దర్శనమివ్వడంతో పోర్టు సెక్యూరిటీ వర్గాలు నివ్వెరపోయాయి. పోర్టు సమీపంలో రైలులో కార్మికులు వ్యాగన్లను పరిశీలిస్తుండగా గ్రానైట్‌ రాళ్ల మధ్య ఓ ప్లాస్టిక్‌ క్యారీబ్యాగ్‌ కనిపించింది. అందులో నెలలు నిండని ఓ మతశిశువు ఉంది. దీంతో కార్మికులు వెంటనే పోర్టు సెక్యూరిటీకి సమాచారం అందించారు.

వెంటనే పోర్టు సెక్యూరిటీ అధికారులు, కష్ణపట్నం పోలీసులు గూడ్సు రైలు వద్దకు చేరి, మతశిశువును పరిశీలించారు. గర్భంలోనే మతిచెందిన శిశువునుగానీ, లేదా అబార్షన్‌ చేయించుకున్న మహిళ శిశువునుగానీ గుర్తుతెలియని వ్యక్తులు ప్లాస్టిక్‌ సంచిలో ఉంచి, గూడ్సు రైలులో పడవేసివుంటారని భావిస్తున్నారు.

Advertisement
Advertisement