ట్రాక్టర్‌ బోల్తాపడి వ్యక్తి మృతి | man dies of tractor rolls | Sakshi
Sakshi News home page

ట్రాక్టర్‌ బోల్తాపడి వ్యక్తి మృతి

Jan 10 2017 10:59 PM | Updated on Sep 5 2017 12:55 AM

ట్రాక్టర్‌ బోల్తాపడిన ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు.

కూడేరు : ట్రాక్టర్‌ బోల్తాపడిన ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఆత్మకూరు మండల కేంద్రం నుంచి కూడేరు మండలం బ్రాహ్మణపల్లికి మంగళవారం ఇసుకలోడుతో ట్రాక్టర్‌ బయల్దేరింది.  పి.నారాయణపురం వద్దకు రాగానే మలుపు వద్ద ట్రాక్టర్‌ అదుపుతప్పి బోల్తా పడింది. ట్రాలీలో కూర్చున్న ఆత్మకూరుకు చెందిన శివారెడ్డి(48)పై ఇసుకంతా పడింది. దీంతో ఊపిరాడక ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. కుటుంబ సభ్యులు సంఘటన స్థలానికి చేరుకుని రోదించారు. మృతుడికి భార్య ప్రమీలమ్మ, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement