భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారికి గురువారం నిత్య కల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు.
భద్రాద్రి రామయ్యకు వైభవంగా కల్యాణోత్సవం
Dec 15 2016 7:07 PM | Updated on Sep 4 2017 10:48 PM
ఖమ్మం: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారికి గురువారం నిత్య కల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. గోదావరి నుంచి అర్చకులు, ఆస్ధాన విద్వాంసులు మంగళ వాయిద్యాల మధ్య తీసుకొచ్చిన గోదావరి జలాలతో స్వామివారి పాదాలకు అభిషేకం నిర్వహించారు. అనంతరం రాములోరికి పూజలు నిర్వహించారు. వేదపండితుల వేద మంత్రోచ్ఛారణల మధ్య అర్చకులు రామయ్యకు వైభవంగా నిత్యకల్యాణం జరిపించారు.
Advertisement


