యాంకరింగ్‌తోనే గుర్తింపు | Sakshi
Sakshi News home page

యాంకరింగ్‌తోనే గుర్తింపు

Published Sat, Aug 26 2017 11:00 PM

యాంకరింగ్‌తోనే గుర్తింపు - Sakshi

- శ్రీశైలంలో సినీనటి, యాంకర్‌ అనసూయ
- కుటుంబ సభ్యులతో స్వామివారి దర్శనం  
 
శ్రీశైలం: సినిమాలు, సీరియల్స్‌లో నటించినా యాంకరింగ్‌తోనే ప్రేక్షకులకు దగ్గరయ్యానని అనసూయ తెలిపారు. మల్లన్న దర్శనార్థం ఆమె కుటుంబ సభ్యులతో కలసి శనివారం శ్రీశైలం వచ్చారు. స్వామివారికి రుద్రాభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన తదితర ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అనసూయ మాట్లాడుతూ జబర్ధస్త్‌ తనకు టీవీ యాంకర్‌గా బాగా గుర్తింపు తెచ్చిందన్నారు. కొన్ని మంచి సినిమాల్లో కూడా అవకాశాలు లభించాయని, అయితే టీవీ యాంకరింగ్‌తోనే ఇరు రాష్ట్రాల్లోని అభిమానులకు చేరువైనట్లు తెలిపారు. శ్రీశైలానికి అనసూచ వచ్చినట్లు తెలుసుకున్న అభిమానులు ఆమెను చూసేందుకు ఉత్సహం కనబరిచారు. ఆలయం బయట కొందరుట ఆమెను కలిసి ఫొటోలు, సెల్ఫీలు దిగారు. దర్శనం అనంతరం హైదరాబాద్‌కు ప్రయాణమయ్యారు.    
 

Advertisement

తప్పక చదవండి

Advertisement