అక్రమంగా గుట్కా ప్యాకెట్లు అమ్ముతున్న చంద్రశేఖర్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు స్థానిక ఎస్హెచ్వో భూమేశ్ తెలిపారు. వివరాలిలా ఉన్నాయి.
గుట్కా ప్యాకెట్ల స్వాధీనం
Jul 18 2016 12:16 AM | Updated on Sep 26 2018 6:49 PM
లక్సెట్టిపేట : అక్రమంగా గుట్కా ప్యాకెట్లు అమ్ముతున్న చంద్రశేఖర్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు స్థానిక ఎస్హెచ్వో భూమేశ్ తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. ఆదివారం మండల కేంద్రంలోని బీట్ బజార్లో ద్విచక్రవాహనంపై గుట్కాలు అమ్ముతుండగా వాహనాన్ని, వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గుట్కాల విలువ సుమారు రూ.10 వేలు ఉంటుంది. కేసు నమోదు చేశారు. ఈ దాడిలో హెడ్ కానిస్టేబుల్ రాజేశ్ పాల్గొన్నారు.
Advertisement
Advertisement