1,00,000 గారెలతో నివేదన | Gharelu offered to bandi agraharam anjaneya swamy | Sakshi
Sakshi News home page

1,00,000 గారెలతో నివేదన

Jun 1 2016 10:41 AM | Updated on Sep 4 2017 1:25 AM

1,00,000 గారెలతో నివేదన

1,00,000 గారెలతో నివేదన

హనుమజ్జయంతి సందర్భంగా దాసాంజనేయ స్వామికి భక్తులు లక్ష గారెలను నివేదించి ఘనంగా పూజలు చేశారు.

అమలాపురం రూరల్: హనుమజ్జయంతి సందర్భంగా మంగళవారం తూర్పు గోదావరి జిల్లా అమలాపురం మండలం పేరూరు శివారు బండివారి అగ్రహారంలో దాసాంజనేయ స్వామికి భక్తులు లక్ష గారెలను నివేదించి ఘనంగా పూజలు చేశారు. తెల్లవారుజాము నుంచే గారెల వంటకంలో గ్రామస్తులు నిమగ్నమయ్యారు.

ఈ సందర్భంగా స్వామివారికి రుద్రాభిషేకాలు, పంచామృతాభిషేకాలు జరిగాయి.  చుట్టుపక్కల గ్రామాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. అనంతరం ఆంజనేయస్వామికి, సువర్చలాదేవికి  కన్నుల పండువగా కల్యాణం నిర్వహించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement