రైతు ఆత్మహత్యలు కొత్తేమీ కాదు: టీ మంత్రులు | farmers suicides is not an fresh issue says t- ministers | Sakshi
Sakshi News home page

రైతు ఆత్మహత్యలు కొత్తేమీ కాదు: టీ మంత్రులు

Sep 16 2015 6:56 PM | Updated on Sep 29 2018 7:10 PM

రైతు ఆత్మహత్యలు కొత్తేమీ కాదు: టీ మంత్రులు - Sakshi

రైతు ఆత్మహత్యలు కొత్తేమీ కాదు: టీ మంత్రులు

రైతు ఆత్మహత్యలపై టీడీపీ, కాంగ్రెస్లు శవరాజకీయాలు చేస్తున్నాయని తెలంగాణ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పోచారం శ్రీనివాసరెడ్డిలు మండిపడ్డారు.

హైదరాబాద్: రైతు ఆత్మహత్యలపై టీడీపీ, కాంగ్రెస్లు శవరాజకీయాలు చేస్తున్నాయని తెలంగాణ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పోచారం శ్రీనివాసరెడ్డిలు మండిపడ్డారు. రైతు ఆత్మహత్యలు కొత్తేమీ కాదని..కాంగ్రెస్, టీడీపీ హయాంలో 23 వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని చెప్పారు. ఆత్మహత్యలు చేసుకున్న రైతులకిచ్చే పరిహారం పెంచాలని ప్రభుత్వం భావిస్తోందని తెలిపారు.

కమిషన్ల కోసమే కాంగ్రెస్ నేతలు...కాలువలు తవ్వించారని పోచారం ధ్వజమెత్తారు. రైతు కుటుంబాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. రైతు ఆత్మహత్యల నివారణకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని తుమ్మల స్పష్టం చేశారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement