
రేపు కంటి వైద్య శిబిరం
ఆదిలాబాద్ పట్టణంలోని విశ్రాంత సంఘ భవనంలో ఈనెల 18న కంటి వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు
ఆదిలాబాద్ రిమ్స్ : ఆదిలాబాద్ పట్టణంలోని విశ్రాంత సంఘ భవనంలో ఈనెల 18న కంటి వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎ. మహేంధ్రనాథ్, ఎస్. మోహన్రెడ్డిలు ఒక ప్రకటనలో తెలిపారు. సికింద్రబాద్లోని పుష్పగిరి ఐ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఈ క్యాంపు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఉదయం 10 గంటల నుంచి పరీక్షలు జరుగుతాయని, పెన్షనర్స్ అందరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.