డ్రంకన్ డ్రైవ్‌లో 28 మందిపై కేసులు నమోదు | Drunk and drive case files on 28 peoples | Sakshi
Sakshi News home page

డ్రంకన్ డ్రైవ్‌లో 28 మందిపై కేసులు నమోదు

Aug 26 2015 6:09 PM | Updated on May 25 2018 2:06 PM

మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వారికి చెక్ చెప్పేందుకు ఎల్‌బీనగర్, ఉప్పల్ ట్రాఫిక్ పోలీసులు మంగళవారం నిర్వహించిన డ్రంకన్ డ్రైవ్‌లో 28 మందిపై కేసులను నమోదు చేశారు.

హైదరాబాద్ : మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వారికి చెక్ చెప్పేందుకు ఎల్‌బీనగర్, ఉప్పల్ ట్రాఫిక్ పోలీసులు మంగళవారం నిర్వహించిన డ్రంకన్ డ్రైవ్‌లో 28 మందిపై కేసులను నమోదు చేశారు. అనంతరం వారిని బుధవారం రంగారెడ్డి జిల్లా కోర్టులో హాజరు పరిచారు.

మేజిస్ట్రేట్ పుష్పాదేశ్‌ముఖ్ డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడిన వాహనదారుల తల్లిదండ్రులు, భార్యలను పిలిపించి వారికి కౌన్సిలింగ్ నిర్వహించారు. మద్యం సేవించి వాహనాలు నడిపిన ఒక్కొక్కరికి రూ.2 వేలు జరిమానా విధించారు. అతిగా మధ్యం సేవించిన ముగ్గురికి 2 రోజుల జైలుశిక్ష విధించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement