ఉరుముల శబ్దానికి మృతి | died by sound of thunder | Sakshi
Sakshi News home page

ఉరుముల శబ్దానికి మృతి

Apr 8 2017 11:33 PM | Updated on Oct 1 2018 2:44 PM

మండల పరిధిలోని విరుపాపురం గ్రామంలో ఉరుముల శబ్దానికి మల్లయ్య (50) అనే మృతి చెందాడు.

హాలహర్వి: మండల పరిధిలోని విరుపాపురం గ్రామంలో ఉరుముల శబ్దానికి మల్లయ్య (50) అనే మృతి చెందాడు. బంధువుల వివరాల మేరకు.. శనివారం మధ్యాహ్నం మల్లయ్య పొలంలో పని చేస్తుండగా భయంకరమైన గాలితో పాటు ఉరుములు మెరుపులతో కూడిన వర్షం వచ్చింది. ఆ శబ్దాలకు భయపడి పొలంలోనే గుండెపోటు వచ్చి అక్కడికక్కడే మృతి చెందాడు. పొలానికి వెళ్లిన మల్లయ్య ఎంత సేపటికీ ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురైయ్యారు.  కుమారుడు వీరేశ్‌ పొలానికి వెళ్లి గాలించగా తండ్రి మృతి చెంది ఉండడం కంట పడింది. ఉరుములు మెరుపుల శబ్దానికి భయపడడంతో గుండెపోటు వచ్చి చనిపోయాడని కుటుంబ సభ్యులు తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement